NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజ్‌భవన్‌లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం
    తదుపరి వార్తా కథనం
    రాజ్‌భవన్‌లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం
    రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ జరుపుకోవాలని గవర్నర్‌‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

    రాజ్‌భవన్‌లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం

    వ్రాసిన వారు Stalin
    Jan 25, 2023
    04:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

    రాష్ట్రంలో రిపబ్లిక్ డే వేడుకలను అధికారంగా నిర్వహించడం లేదని, రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ జరుపుకోవాలని తెలంగాణ గవర్నర్‌ తమిళసైకి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

    ప్రతి ఏటా పరేడ్ గ్రౌండ్‌లో రిపబ్లిక్ డే వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ వేడుకలకు గవర్నర్ హాజరై ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని చదువుతారు. గురువారం రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ప్రసంగం కాపీని పంపాలని ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై లేఖ రాశారు. స్పందించిన ప్రభుత్వం ఈ ఏడాది వేడుకలను రాజ్ భవన్‌లోనే జరుపుకోలని సమాధానం రాసింది.

    గవర్నర్

    కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్ తమిళసై

    2022లో కరోనా కారణంగా తెలంగాణ ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్‌లో రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేసింది. దీంతో గవర్నర్ తమిళసై రాజ్‌భవన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా ఆమె ఉండటంతో హైదరబాద్ నుంచి నేరుగా అక్కడి వెళ్లి అక్కడి అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

    ఈ ఏడాది కూడా వేడుకలు అధికారికంగా నిర్వహించకపోవడంతో హైదరాబాద్ రాజ్ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరి వెళ్లనున్నారు.

    తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించకపోవడంపై గవర్నర్ తమిళసై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కరోనా పేరుతో వేడుకలను నిర్వహించకపోవడం సరికాదన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    గవర్నర్
    గణతంత్ర దినోత్సవం

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    తెలంగాణ

    గోషామహల్ బస్తీలో కుంగిన పెద్ద నాలా.. దుకాణాలు, వాహనాలు అందులోకే.. భారతదేశం
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? చంద్రబాబు నాయుడు
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్.. సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీల భర్తీ భారతదేశం

    గవర్నర్

    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! తమిళనాడు
    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి తమిళనాడు
    అరుణా మిల్లర్: అమెరికాలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా ప్రమాణం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    గణతంత్ర దినోత్సవం

    రిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం దిల్లీ
    ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది ఛత్తీస్‌గఢ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025