
Bullet Train: తెలంగాణలో బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు కొత్త మార్పులు.. మూడు రాష్ట్రాలపై ప్రభావం - ఖర్చు, సమయం తగ్గే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు మధ్య రూపొందనున్న హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం రైల్వే శాఖకు అభ్యర్థన పంపింది. ఈ అంశంపై చర్చ సెప్టెంబర్ 11న రైల్వే అధికారులు, సీఎమ్ రేవంత్ రెడ్డి మధ్య జరిగిన సమావేశంలో జరిగింది. రెండు కారిడార్ల కలిపి అంచనా వ్యయం సుమారు రూ. 3.30 లక్షల కోట్లకు చేరనుందని అధికారులు వెల్లడించారు.
వివరాలు
హైదరాబాద్-చెన్నై రూట్లో మార్పు:
ప్రస్తుతం రైల్వే ప్రతిపాదన ప్రకారం, హైదరాబాద్ నుంచి విజయవాడ నేషనల్ హైవే మార్గం ద్వారా (నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం మార్గం) చెన్నై వరకు రైలు మార్గం ఏర్పాటు చేయబడనుంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా సూచించిన ప్రకారం, శంషాబాద్ ప్రాంతం నుంచి మిర్యాలగూడ వైపు అమరావతి వరకు వచ్చే గ్రీన్ఫీల్డ్ హైవే పక్కన రైలు లైన్ ఏర్పాటు చేయాలని సూచించింది. సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం ప్రకారం, ఈ మార్పు జరిగితే నిర్మాణ వ్యయం, సమయం రెండూ గణనీయంగా తగ్గుతాయని వెల్లడించారు. ఈ కొత్త మార్గానికి అంచనా వ్యయం రూ. 1.86 లక్షల కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. జీఎం ఆమోదం లభించిన తరువాతే సర్వే ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
వివరాలు
హైదరాబాద్-బెంగళూరు కారిడార్లో ప్రతిపాదనలు:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా,ఈ కారిడార్లో శ్రీశైలం మార్గం ద్వారా హైస్పీడ్ రైలు లైన్ ఏర్పాటు చేయడం మంచిదని సూచించింది. ఇది ప్రధానంగా ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ రూపంలో నేషనల్ హైవే ప్రాజెక్ట్ అభివృద్ధి కొనసాగుతున్న కారణంగా ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే, రైల్వే అధికారులు శ్రీశైలం మార్గం ఖర్చుతో కూడుకున్నదని, ఈ ప్రాజెక్ట్ నిష్పత్తిగా ఎక్కువ వ్యయం అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కారిడార్కు అంచనా వ్యయం సుమారు రూ. 1.44 లక్షల కోట్లు. వీటి రెండు ప్రాజెక్టులు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక/తమిళనాడు రాష్ట్రాల ద్వారా) పూర్తయిన తర్వాత, సంబంధిత ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.