NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TGIIC: కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ కీలక ప్రకటన.. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే
    తదుపరి వార్తా కథనం
    TGIIC: కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ కీలక ప్రకటన.. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే
    ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే

    TGIIC: కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ కీలక ప్రకటన.. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 31, 2025
    01:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ (TGIIC) కీలక ప్రకటన విడుదల చేసింది.

    ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టంగా ప్రకటించింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూమి లేదని స్పష్టం చేసింది.ఈ విషయాన్ని టీజీఐఐసీ తెలియజేసింది.

    కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదే.ఈ భూమి హక్కుదారుడుగా ప్రభుత్వం న్యాయస్థానంలో తన ఆధిక్యతను నిరూపించుకుంది. 21 సంవత్సరాల క్రితం ప్రైవేటు సంస్థకు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా తిరిగి సాధించుకుంది.అభివృద్ధి కోసం కేటాయించిన భూమిలో ఎలాంటి చెరువులు లేవు.సర్వే ప్రకారం,అక్కడి ఒక్క అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీకి చెందదని తేలింది.నూతనంగా అమలు చేయనున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల భౌగోళిక నిర్మాణాన్ని ఏమాత్రం దెబ్బతీయదు.

    వివరాలు 

    బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవు:  టీజీఐఐసీ 

    ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలో స్థానిక స్థిరాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు ప్రాముఖ్యతనిస్తుంది.

    ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్న కొందరు రాజకీయ నాయకులు విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారు.

    400 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వ స్వాధీనంలోనే ఉంది. అటవీ భూమిగా తప్పుడు ప్రచారం జరుగుతోంది.

    రెవెన్యూ రికార్డుల ప్రకారం కూడా ఈ 400 ఎకరాలు ప్రభుత్వ భూమిగానే లిఖించబడ్డాయి.

    ఇందులో బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవు. ప్రపంచ స్థాయి ఐటీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, అనుసంధానత విస్తరణ, పట్టణ స్థలాల సమర్థవంతమైన వినియోగం వంటి ప్రభుత్వ లక్ష్యాలకు ఈ ప్రాజెక్టు అనుగుణంగా కొనసాగుతుంది''అని టీజీఐఐసీ వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    తెలంగాణ

    Tg Ssc Exams 2025 : మార్చి 21 నుంచి టెన్త్‌ పరీక్షలు! నిమిషం నిబంధన అమల్లో ఉంటుందా? భారతదేశం
    Sudheer Reddy: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు బీఆర్ఎస్
    Telangana: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం  భారతదేశం
    TG Stamps Registration: తెలంగాణలో రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్.. ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రయోగాత్మక అమలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025