NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Property Registrations: ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరింత వేగవంతంగా.. పారదర్శకంగా.. కీలక సంస్కరణలకు సన్నద్ధం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Property Registrations: ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరింత వేగవంతంగా.. పారదర్శకంగా.. కీలక సంస్కరణలకు సన్నద్ధం
    ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరింత వేగవంతంగా.. పారదర్శకంగా.. కీలక సంస్కరణలకు సన్నద్ధం

    Property Registrations: ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరింత వేగవంతంగా.. పారదర్శకంగా.. కీలక సంస్కరణలకు సన్నద్ధం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 24, 2025
    08:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    స్టాంపులు,రిజిస్ట్రేషన్ల శాఖ కీలక సంస్కరణలకు సిద్ధమవుతోంది.రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత వేగంగా, పారదర్శకంగా, సులభతరంగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపడుతోంది.

    ఇందులో భాగంగా సమీకృత(ఇంటిగ్రేటెడ్‌)కార్యాలయాల ఏర్పాటు కోసం కార్యాచరణ రూపొందిస్తోంది.

    భవిష్యత్తులో పాస్‌పోర్ట్ జారీ విధానాన్ని అనుసరిస్తూ కొత్త రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు.

    ఈ విధానం ద్వారా,ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రయాణించాల్సిన అవసరం తగ్గుతుంది.

    ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది.

    ఇకపై, ఎవరైతే అందుబాటులో ఉంటారో, వారు రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. ఇది అవినీతిని తగ్గించి, వినియోగదారులకు తగిన సమాచారం ముందుగానే అందించేందుకు ఉపయోగపడుతుంది.

    ప్రారంభంలో హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో ఈ కొత్త విధానాన్ని అమలు చేసి, తదనంతరం జిల్లాలకు విస్తరించనున్నారు.

    వివరాలు 

    ఆర్థిక లక్ష్యాలు 

    ఇటీవల, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ సంస్కరణలపై సమీక్ష నిర్వహించి కొన్ని కీలక సూచనలు చేశారు.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ రూ. 14,500 కోట్లు ఆదాయం సాధించింది. వచ్చే ఏడాది దీన్ని రూ. 19,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    ఒకే స్లాట్ - రెండు కార్యాలయాల్లో సేవలు!

    హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

    కొన్ని కార్యాలయాల్లో రోజుకు 70-100 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, మరికొన్ని కార్యాలయాల్లో చాలా తక్కువగా జరుగుతున్నాయి.

    ఇందుకు పరిష్కారంగా, వినియోగదారులు రిజిస్ట్రేషన్ స్లాట్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నప్పుడు, అవసరమైన కార్యాలయాన్ని స్వయంచాలకంగా కేటాయించే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.

    వివరాలు 

    సంస్థాగత మార్పులు.. సమీకృత భవనాలు 

    ఇప్పటివరకు, స్థిరాస్తి కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్‌ చేసుకుని, తాము ఎంచుకున్న కార్యాలయానికి వెళ్తూ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి వచ్చేది.

    అయితే, కొన్నిసార్లు ఆలస్యంగా రిజిస్ట్రేషన్ జరిగి, అర్ధరాత్రి వరకు లేనిచో మరుసటి రోజుకు వాయిదా పడేది.

    కొత్త విధానంలో, ఒకే చోట రెండు లేదా మూడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేసి, అందుబాటులో ఉన్న సిబ్బంది ద్వారా రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తి చేయనున్నారు.

    ఈ కొత్త విధానం అమలుకు అవసరమైన భవనాల నిర్మాణానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం అయ్యాయి.

    ఇందులో భాగంగా, సమీకృత భవనాలను నిర్మించి, అన్ని కార్యాలయాలను ఒకే చోట అందుబాటులో ఉంచనున్నారు.

    వివరాలు 

    నూతన విధానంలో: 

    వినియోగదారులు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న వెంటనే SMS ద్వారా సమాచారం అందుతుంది.

    భూ యజమానులు నిర్ణీత సమయానికి కార్యాలయ సముదాయానికి చేరుకుంటారు.

    ప్రత్యక్షంగా స్క్రీన్‌లో, ఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయబడుతుందో చూపించబడుతుంది.

    తదనుగుణంగా, వినియోగదారులు సంబంధిత కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకోవచ్చు.

    వివరాలు 

    రాష్ట్రవ్యాప్తంగా 7 కొత్త కార్యాలయాలు 

    ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 144 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి.

    అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగే రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు తక్కువగా ఉన్నాయి.

    కాబట్టి, ఈ ప్రాంతాల్లో కొత్తగా 7 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు:

    రంగారెడ్డి: కందుకూరు, మణికొండ

    మేడ్చల్ మల్కాజిగిరి: నిజాంపేట్, దుండిగల్, బోడుప్పల్

    సంగారెడ్డి: అమీన్‌పూర్

    వరంగల్: తొర్రూరు లేదా మరిపెడ

    వివరాలు 

    రాత్రి 8 గంటల వరకు రిజిస్ట్రేషన్ సేవలు 

    హైదరాబాద్ నగరంలో రిజిస్ట్రేషన్ సేవలను రాత్రి 8 గంటల వరకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

    అత్యధిక రిజిస్ట్రేషన్లు జరుగుతున్న కార్యాలయాల్లో రెండు షిఫ్టులు (ఉదయం-మధ్యాహ్నం, మధ్యాహ్నం-రాత్రి 8 గంటల వరకు) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.

    ప్రతి షిఫ్టుకు వేర్వేరు సబ్-రిజిస్ట్రార్లు.. సిబ్బంది నియమిస్తారు.

    సిబ్బందిపై పని భారం తగ్గుతుంది.

    వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందుతాయి.

    ఈ కొత్త విధానాలు ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా, అవినీతిముక్తంగా మార్చేందుకు దోహదపడతాయి.

    ముఖ్యంగా, సమీకృత కార్యాలయాల ద్వారా వేచిచూడాల్సిన సమస్య తగ్గిపోతుంది.

    ఈ మార్పులు ప్రభుత్వ ఖజానాకు అధిక ఆదాయం తీసుకురావడంతో పాటు, ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి తోడ్పడతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Rajnath Singh:మసూద్ అజార్‌కు పాకిస్తాన్ ₹14 కోట్లు పరిహారం.. IMF రుణం గురించి పునరాలోచించాలి': రాజ్ నాథ్ సింగ్  రాజ్‌నాథ్ సింగ్
    NTR: హృతిక్‌ రోషన్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌'పై స్పందించిన ఎన్టీఆర్‌  జూనియర్ ఎన్టీఆర్
    Prophase: సైబర్ యుద్ధంలో భారత్‌ రక్షణ కవచంగా నిలిచిన 'ప్రొఫేజ్‌' టెక్నాలజీ
    Pillalamarri Banyan Tree: నేడు పాలమూరుని సందర్శించనున్న ప్రపంచ అందగత్తెలు !  తెలంగాణ

    తెలంగాణ

    Telangana: పౌరుల సమగ్ర డేటాబేస్ రూపొందించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం.. మీ నుంచి ఏ వివరాలు సేకరించనున్నారంటే ?  భారతదేశం
    Group-2 Results: నేడు గ్రూప్-2 ఫలితాల విడుదల.. 5 లక్షల మంది ఎదురు చూపులు ఇండియా
    SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో అన్వి రోబో మిషన్.. రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగవంతం హైదరాబాద్
    Telangana Assembly Sessions:రేపటి నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు.. భద్రతా చర్యలు కట్టుదిట్టం క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025