NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఓఆర్‌ఆర్‌పై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్.. దూసుకెళ్లనున్న వాహనాలు 
    తదుపరి వార్తా కథనం
    ఓఆర్‌ఆర్‌పై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్.. దూసుకెళ్లనున్న వాహనాలు 
    ఓఆర్‌ఆర్‌పై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్

    ఓఆర్‌ఆర్‌పై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్.. దూసుకెళ్లనున్న వాహనాలు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 27, 2023
    08:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వేగవంతమైన ప్రయాణానికి హైదరాబాద్ మహానగరం పరిధిలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు దిక్సూచిగా నిలుస్తోంది. ఈ మేరకు వాహనదారులు మరింత వేగంతో వెళ్లేందుకు తెలంగాణ పురపాలక శాఖ నిర్ణయించింది.

    ఓఆర్ఆర్ పై ప్రస్తుతానికి గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు దూసుకెళ్తున్నాయి. తాజాగా ఈ వేగాన్ని 120 కిలోమీటర్ల వేగానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

    ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు ఓఆర్‌ఆర్‌ అధికారులతోనూ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

    ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణికులకు మెరుగైన భద్రతా సౌకర్యాలు కల్పించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు.

    DETAILS

    ఏటా ఓఆర్ఆర్ పై రూ.415 కోట్ల ఆదాయం

    అనంతరం ఓఆర్ఆర్ పై ప్రభుత్వం తీసుకున్న స్పీడ్ లిమిట్ ను 120 కిలోమీటర్లకు పెంచామని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ వెల్లడించారు.

    అయితే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ ను అప్పగించే అంశంలో రాజకీయ విమర్శల పర్వం కొనసాగుతోంది.

    తెలంగాణ ప్రభుత్వం టోల్ టెండర్ విషయంలో భారీ అవినీతికి పాల్పడిందని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

    ఏటా ఓఆర్ఆర్ పై రూ.415 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఏటా 5 శాతం పెరిగినా 30 ఏళ్లకు ప్రభుత్వానికి దాదాపు రూ. 30 వేల కోట్లు సమకూరేవన్నారు.

    స్వప్రయోజనాలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, దీనిపై విచారణ జరిపించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ప్రభుత్వం

    తాజా

    Delhi Police: భారత్'లో మరో ఉగ్ర దాడికి ఐఎస్‌ఐ కుట్ర ..స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు  భారతదేశం
    Trump - Ramaphosa Meeting: సౌత్ ఆఫ్రికాలో శ్వేత జాతీయులపై దాడి ఆరోపణలు.. తిప్పికొట్టిన సిరిల్ రామఫోసా డొనాల్డ్ ట్రంప్
    Kumki elephants: కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక.. బదిలీ ఆదేశ పత్రాలు అందుకున్న ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్
    Earthquake: గ్రీస్‌లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ గ్రీస్

    తెలంగాణ

    సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్ బొనాంజ.. దసరాకి చెల్లిస్తామన్న సీఎం ప్రభుత్వం
    రాష్ట్రాలకు మూడో విడత పన్నుల పంపిణీ; రూ.1.1 లక్షల కోట్లను విడుదల చేసిన కేంద్రం  పన్ను
    మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇకలేరు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    కేంద్రం పన్నుల్లో వాటా : ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2,486 కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి

    ప్రభుత్వం

    ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం; రూ.1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీ మన్‌సుఖ్ మాండవీయ
    పాకిస్థాన్: ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై ఏ క్షణమైనా పంజాబ్ పోలీసుల దాడి; ఉగ్రవాదులే టార్గెట్ పాకిస్థాన్
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025