Page Loader
#YsJagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు షాక్.. తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ
Ys Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు షాక్.. తెలంగాణ హైకోర్టు నోటీసులు

#YsJagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు షాక్.. తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 08, 2023
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఈ మేరకు అక్రమాస్తుల కేసులో జగన్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య, జగన్‌ అక్రమాస్తుల కేసులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(Public Interest Litigation)పై విచారణ చేపట్టింది. పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రావణ్‌ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే హరిరామ జోగయ్య దాఖలు చేసిన సవరణలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

details

ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు హైకోర్టు అంగీకారం

ఈ సందర్భంగానే జోగయ్య పిటిషన్ ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు హైకోర్టు అంగీకారించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఈ మేరకు పిల్‌కు నంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ప్రతివాదులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సీబీఐ ఏజెన్సీ, సీబీఐ కోర్టుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కోర్టులో కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలంటూ హరి రామజోగయ్య పిల్‌ దాఖలు చేశారు. 2024లో జరగనున్న ఆంధ్రుప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోగా కేసులను తేల్చేలా ఆదేశాలివ్వాలని ఆయన పిల్​లో పేర్కొన్నడం గమనార్హం.