NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / టీఎస్పీఎస్సీ లీకేజీలో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్.. రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్ 
    టీఎస్పీఎస్సీ లీకేజీలో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్.. రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్ 
    1/2
    భారతదేశం 1 నిమి చదవండి

    టీఎస్పీఎస్సీ లీకేజీలో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్.. రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 09, 2023
    07:03 pm
    టీఎస్పీఎస్సీ లీకేజీలో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్.. రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్ 
    రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్

    టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలైంది. ఈ మేరకు సిట్‌ అధికారులు దాఖలు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు ఈ కేసులో రూ.1.63 కోట్ల మేర లావాదేవీలు జరిగాయని విచారణలో తేలిందన్నారు. నిందితులకు సంబంధించిన అకౌంట్ వివరాలు, చేతుల మారిన నగదుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే తాము స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇంకా కొందరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 49 మందిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేశారు. అయితే వీరిలో దాదాపు 16 మంది మధ్యవర్తులుగా ఉన్నట్లు నిగ్గుతేల్చామని ఛార్జ్‌షీట్‌లో రాసుకొచ్చారు.

    2/2

    విశ్లేషణ నిమిత్తం ఫోరెనిక్స్‌ సైన్స్‌ ల్యాబ్ కి తరలించాం : సిట్

    మరో నిందితుడు ప్రశాంత్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసి న్యూజిలాండ్‌లో ఉన్నాడని తెలిపారు. ఇక ఇంజనీరింగ్ కు సంబంధించి ఏఈఈ పేపర్ లీకేజీ 13 మందికి, డీఏవో పేపర్‌ 8 మందికి, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నలుగురికి చేరినట్లు నిర్థారించారు. గ్రూప్‌-1 నలుగురు నిందితుల్లో టీఎస్‌పీఎస్సీలోనే ముగ్గురు ఉద్యోగులు పనిచేస్తారని, మరొకరు బయటి వ్యక్తి అని తేలిందన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో దశలోనే ఉన్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు డీఈ పూల రమేష్‌ సపోర్టుతో ఏఈఈ, డీఏవో పరీక్షల్లో కాపియింగ్ కు పాల్పడ్డ ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. అనంతరం నిందితుల మొబైల్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలను రామంతాపూర్‌ ఫోరెనిక్స్‌ సైన్స్‌ ల్యాబ్ కి తరలించామన్నారు. ఫలితంగా అదనపు సమాచారం లభించిందని, ఈ మేరకు అరెస్టుల సంఖ్య పెరిగనుందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలంగాణ
    విద్యా శాఖ మంత్రి

    తెలంగాణ

    ఈటలకు అధిష్ఠానం పిలుపు.. కీలక పదవి అప్పగించే అవకాశం భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన మంత్రి గంగులను రక్షించిన భద్రతా సిబ్బంది గంగుల కమలాకర్
    విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ కానుక.. జూన్‌ 20 నుంచి ప్రతిరోజూ రాగిజావా ప్రభుత్వం
    తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం వర్షాకాలం

    విద్యా శాఖ మంత్రి

    ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులకు నోట్ .. ఈ ఏడాది సెలవుల జాబితా ఇదిగో ! ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: 2023-24 అకాడమిక్ క్యాలెండర్‌ రిలీజ్.. జూన్ 12 నుంచి కొత్త అకాడమిక్ ఇయర్ తెలంగాణ
    NIRF Ranking 2023: దేశంలోని విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల చేసిన కేంద్రం; టాప్-10 ఇవే యూనివర్సిటీ
    డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హోదాకు నయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేంద్రమంత్రి
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023