NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / టీఎస్పీఎస్సీ లీకేజీలో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్.. రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్ 
    తదుపరి వార్తా కథనం
    టీఎస్పీఎస్సీ లీకేజీలో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్.. రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్ 
    రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్

    టీఎస్పీఎస్సీ లీకేజీలో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్.. రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 09, 2023
    07:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలైంది. ఈ మేరకు సిట్‌ అధికారులు దాఖలు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు ఈ కేసులో రూ.1.63 కోట్ల మేర లావాదేవీలు జరిగాయని విచారణలో తేలిందన్నారు.

    నిందితులకు సంబంధించిన అకౌంట్ వివరాలు, చేతుల మారిన నగదుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే తాము స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇంకా కొందరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

    ఇప్పటి వరకు 49 మందిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేశారు. అయితే వీరిలో దాదాపు 16 మంది మధ్యవర్తులుగా ఉన్నట్లు నిగ్గుతేల్చామని ఛార్జ్‌షీట్‌లో రాసుకొచ్చారు.

    DETAILS

    విశ్లేషణ నిమిత్తం ఫోరెనిక్స్‌ సైన్స్‌ ల్యాబ్ కి తరలించాం : సిట్

    మరో నిందితుడు ప్రశాంత్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసి న్యూజిలాండ్‌లో ఉన్నాడని తెలిపారు. ఇక ఇంజనీరింగ్ కు సంబంధించి ఏఈఈ పేపర్ లీకేజీ 13 మందికి, డీఏవో పేపర్‌ 8 మందికి, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నలుగురికి చేరినట్లు నిర్థారించారు.

    గ్రూప్‌-1 నలుగురు నిందితుల్లో టీఎస్‌పీఎస్సీలోనే ముగ్గురు ఉద్యోగులు పనిచేస్తారని, మరొకరు బయటి వ్యక్తి అని తేలిందన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో దశలోనే ఉన్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

    మరోవైపు డీఈ పూల రమేష్‌ సపోర్టుతో ఏఈఈ, డీఏవో పరీక్షల్లో కాపియింగ్ కు పాల్పడ్డ ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. అనంతరం నిందితుల మొబైల్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలను రామంతాపూర్‌ ఫోరెనిక్స్‌ సైన్స్‌ ల్యాబ్ కి తరలించామన్నారు. ఫలితంగా అదనపు సమాచారం లభించిందని, ఈ మేరకు అరెస్టుల సంఖ్య పెరిగనుందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    విద్యా శాఖ మంత్రి

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    తెలంగాణ

    రెండు దేశాలు, 80 సమావేశాలు, 42వేల ఉద్యోగాలు; కేటీఆర్ విదేశీ పర్యటన సాగిందిలా హైదరాబాద్
    రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత.. ఈ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు  వాతావరణ మార్పులు
    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    తెలంగాణలో వచ్చే 10ఏళ్లలో భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్  విద్యుత్

    విద్యా శాఖ మంత్రి

    ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా బడ్జెట్ 2023
    10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ఆంధ్రప్రదేశ్
    ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం ఇండియా లేటెస్ట్ న్యూస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025