తదుపరి వార్తా కథనం

Sowmya Accident : ఫ్లోరిడాలో యాదాద్రి జిల్లా అమ్మాయి దుర్మరణం
వ్రాసిన వారు
Stalin
May 27, 2024
07:03 pm
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని ఫ్లోరిడాలో తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా అమ్మాయి సౌమ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.
25 ఏళ్ల గుంటిపల్లి సౌమ్యను వేగంగా వచ్చి కారు ఢీకొంది. ఈ ఘటన ఆదివారం జరిగింది.
ఆమెఫ్లోరిడా అట్లాంటికా యూనివర్శిటీలో ఎంఎస్ పూర్తి చేశారు. మే 11న తన పుట్టిన రోజు జరుపుకుంది. కన్సల్టెంట్ ద్వారా ఉద్యోగం కోసంసౌమ్య ప్రయత్నం చేస్తుంది.
తల్లి బాలమణి , ఇతర కుటుంబ సభ్యులు మృత దేహం తెప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆమె తండ్రి కోటేశ్వరరావు ఈ మేరకు విదేశాంగ మంత్రి జై శంకర్ కు విన్నవించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమెరికాలో తెలుగమ్మాయి మృతి
ఉన్నత చదువుల కోసం వెళ్లి.. అమెరికాలో తెలుగమ్మాయి మృతి#USAccident #Telanganawomanhttps://t.co/XHhMb7IzKB
— Samayam Telugu (@SamayamTelugu) May 27, 2024