Page Loader
Encounter: జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్తత.. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్
జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్తత.. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్

Encounter: జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్తత.. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 09, 2025
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలోని రామ్‌నగర్ మండలానికి చెందిన మార్తా గ్రామంలో భద్రతా దళాలు, అనుమానిత ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరగుతున్నాయి. జమ్ముకశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా బలగాలు కలసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన సమయంలో ఉగ్రవాదులు ఉన్నట్టు గుర్తించారు. అప్పటి నుంచే కాల్పులు మొదలయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 2 నుంచి 3 మంది ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు సమాచారం. కాల్పులు ఇంకా కొనసాగుతుండగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. మృతుల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయాన్ని డీఐజీ ఉదంపూర్-రియాసీ రేంజ్ రైస్ మహ్మద్ భట్ వెల్లడించారు. గత నెల చివర్లో కథువా జిల్లాలో కూడా ఉగ్రవాద చొరబాటు దాడిని భద్రతా బలగాలు ఆపిన విషయం తెలిసిందే.

Details

అటవీ ప్రాంతంలో దాక్కున్నట్లు సమాచారం

హిరానగర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న సన్యాల్ గ్రామంలో అనుమానిత ఉగ్రవాదుల సమూహం ముళ్లబారిన అటవీ ప్రాంతంలో దాక్కున్నట్లు సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆ సమయంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో 2 నుండి 5 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు భావించారు. వీరిని భద్రతా దళాలు చుట్టుముట్టి నిర్వీర్యం చేసినట్లు తెలిసింది. ఈ ఆపరేషన్‌లో జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు పాల్గొన్నాయి. మార్చి 25 తెల్లవారుజామున హిరానగర్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు సమీప అటవీ ప్రాంతాల్లో జాయింట్ సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టిన సంగతి తెలిసిందే.