NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు 
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు 
    మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు

    మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు 

    వ్రాసిన వారు Stalin
    Apr 28, 2023
    12:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం హాజరుకావాల్సిన ఈవెంట్ వేదికను గురువారం రాత్రి కొందరు తగలబెట్టారు.

    వాస్తవానికి మణిపూర్‌లోని చురచంద్‌పూర్ జిల్లాలో సీఎం నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్ శుక్రవారం జిమ్-కమ్-స్పోర్ట్స్ సెంటర్‌ను ప్రారంభించాల్సి ఉంది.

    బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు చేయబడిన రక్షిత అడవులు, చిత్తడి నేలలపై చేసిన సర్వేపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఒక ఆదివాసీ గిరిజన ఫోరమ్ సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు పెట్టినట్లు సమాచారం.

    చాలా రోజులు ఆదివాసీ గిరిజన ఫోరమ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చర్చిలను కూల్చివేసిందని గిరిజన ఫోరం ఆరోపించింది.

    మణిపూర్

    చురచంద్‌పూర్‌లో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు

    చురచంద్‌పూర్‌లో సీఎం ఈవెంట్ వేదికకు నిప్పు పెట్టిన నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. సెక్షన్ 144 విధించారు.

    ఆదివాసీ గిరిజన ఫోరమ్ సీఎం కార్యక్రమ వేదిక వద్ద ఉన్నట్లు కుర్చీలు, ఇతర ఆస్తులను ధ్వంసం చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కొత్తగా నిర్మించిన జిమ్‌లోని క్రీడా సామగ్రిని కూడా తగులబెట్టారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, పోలీసులు హింసకు పాల్పడుతున్న గుంపును చెదరగొట్టారు.

    పరిస్థితి అదుపు తప్పడంతో చురచంద్‌పూర్‌ జిల్లాలో భద్రతను పోలీస్ శాఖ కట్టుదిట్టం చేసింది.

    చురచంద్‌పూర్‌‌లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

    హింస నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యక్రమం ఉంటుందా? రద్దయ్యిందా? అనే విషయాన్ని జిల్లా యంత్రాంగం ఇంకా నిర్ధారించలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముఖ్యమంత్రి
    తాజా వార్తలు

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ముఖ్యమంత్రి

    ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్
    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు ఆంధ్రప్రదేశ్
    కర్ణాటకలో 'PayCM' క్యూఆర్ కోడ్ పోస్టర్ల కలకలం; కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్ కర్ణాటక

    తాజా వార్తలు

    ఖగోళ అద్భుతం: బెంగళూరులో జీరో షాడో డే- నీడలు అదృశ్యం  బెంగళూరు
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా?  బిహార్
    CBSE 2023: సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు ఎప్పుడు విడదలవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి  విద్యార్థులు
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025