Jammu & Kashmir: జమ్ముకశ్మీర్ లోని పూంచ్లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి
జమ్ముకశ్మీర్లోని పూంచ్లో గురువారం ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని అధికారులను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. జిల్లాలోని తనమండి ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలించామని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని వారు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో బుధవారం సాయుధ పోలీసు యూనిట్ కాంపౌండ్లో పేలుడు సంభవించిన తర్వాత ఈ సంఘటన జరిగింది. సూరంకోట్ ప్రాంతంలో డిసెంబర్ 19, 20 మధ్య రాత్రి సంభవించిన పేలుడు కారణంగా కాంపౌండ్ సమీపంలో పార్క్ చేసిన కొన్ని వాహనాల అద్దాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు