NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..!
    తదుపరి వార్తా కథనం
    Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..!
    జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..!

    Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 15, 2025
    08:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతోంది.

    పుల్వామా జిల్లా థ్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు నిఘా వర్గాల సమాచారంతో, భద్రతా దళాలు దానిపై స్పందించి ప్రాదేశికంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

    ఈ దర్యాప్తులో భాగంగా నాదిర్‌ గ్రామంలో తనిఖీలు కొనసాగుతుండగా, ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు దిగారు.

    ఈ ఎన్‌కౌంటర్‌ ప్రస్తుతం కొనసాగుతుండగా, ఇప్పటి వరకు ఒక ఉగ్రవాది హతమైనట్లు సమాచారం.

    జైషే మహ్మద్‌ ఉగ్రసంఘానికి చెందిన మరో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు కూడా ముట్టడిలో చిక్కినట్టు తెలుస్తోంది.

    ఇటీవలి 48 గంటల వ్యవధిలో జమ్మూకశ్మీర్‌లో ఇది రెండవ ఎన్‌కౌంటర్‌గా నమోదు అయింది.

    మంగళవారం, షోపియాన్ జిల్లాలోని జిన్‌పాథర్‌ కెల్లర్‌ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి.

    వివరాలు 

     పహల్గాంలో  ఘోరమైన ఉగ్రదాడి 

    వీరు లష్కరే తయ్యిబా ఉగ్రసంఘానికి చెందినవారని గుర్తించారు. ఈ ఉగ్రవాదులు కశ్మీర్ లోయలో పలు ఉగ్రచర్యల్లో పాలుపంచుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

    ఇదిలా ఉండగా,ఏప్రిల్‌ 22న పహల్గాం సమీపంలోని బైసరన్‌ లోయలో పర్యాటకులపై ఘోరమైన ఉగ్రదాడి చోటుచేసుకుంది.

    సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు చాలా దగ్గర నుండి కాల్పులు జరిపారు.ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

    అనంతరం ఆ ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. అప్పటి నుండి వారిని పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

    ఈ దాడిలో ప్రమేయం ఉన్నారని అనుమానిస్తున్న ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదుల ఫొటోలు ఉన్న పోస్టర్లు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..! జమ్ముకశ్మీర్
    Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి! పర్యాటకం
    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌

    జమ్ముకశ్మీర్

    Udhampur Encounter: భద్రతా బలగాలు,ఉగ్రవాదులకు మధ్య ఉదమ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్‌.. సైనికుడి మృతి  భారతదేశం
    Indus Waters Treaty: భారతదేశం సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేతతో.. పాకిస్థాన్‌కు జ‌రిగే న‌ష్టం ఏంటి? భారతదేశం
    #NewsBytesExplainer: తిరుగు ప్రయాణం మొదలెట్టిన పర్యాటకులు.. జమ్ముకశ్మీర్ పర్యాటక రంగ భవితవ్యం ఏమిటి? పర్యాటకం
    Simla Agreement: పాకిస్తాన్ రద్దు చేస్తామని బెదిరిస్తున్న సిమ్లా ఒప్పందం ఏమిటి? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025