LOADING...
TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్‌పై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన
కర్నూలులో హైకోర్టు బెంచ్‌పై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన

TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్‌పై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

రాయలసీమ వాసుల చిరకాల ఆకాంక్ష అయిన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన చేశారు. చాలా కాలంగా చర్చల్లో ఉన్న ఈ అంశానికి మొట్టమొదటిసారి స్పష్టతనిస్తూ, నగరంలోని ఏబీసీ క్యాంప్ క్వార్టర్స్‌ను హైకోర్టు బెంచ్ స్థాపనకు నిర్ణయించినట్టు వెల్లడించారు. కర్నూలు సమగ్ర అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా అవసరమైన చర్యలను వేగంగా ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ క్వార్టర్స్‌లో జరుగుతున్న అనుచిత, అసాంఘిక కార్యకలాపాలపై మంత్రి గట్టిగా స్పందించారు. ప్రభుత్వ ఆస్తుల వద్ద ఏ విధమైన అనైతిక చర్యలు జరిగినా సహించబోమని, అలాంటి పనులకు పాల్పడేవారిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడదని హెచ్చరించారు.

వివరాలు 

మరిన్ని ప్రాంతాల్లో పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధం: భరత్

అవసరమైతే "కర్రతో సమాధానం చెప్పాల్సి వస్తుంది" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే తప్పకుండా శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కర్నూలు మెడికల్ కళాశాల మసీదు సమీపంలో కొత్త రహదారి నిర్మాణ పనులను ప్రారంభించిన సందర్భంలో మంత్రి భరత్ ఈ వ్యాఖ్యలు చేశారు. నగరంలో ఇంకా అనేక ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, అభివృద్ధి అవసరం ఉందని, త్వరలోనే మరిన్ని ప్రాంతాల్లో పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు.