NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Warangal Special Bus: వరంగల్ నుంచి వివిధ పుణ్య క్షేత్రాలకు స్పెషల్ బస్సులు… ఛార్జీలను ఖరారు చేసిన అధికారులు
    తదుపరి వార్తా కథనం
    Warangal Special Bus: వరంగల్ నుంచి వివిధ పుణ్య క్షేత్రాలకు స్పెషల్ బస్సులు… ఛార్జీలను ఖరారు చేసిన అధికారులు

    Warangal Special Bus: వరంగల్ నుంచి వివిధ పుణ్య క్షేత్రాలకు స్పెషల్ బస్సులు… ఛార్జీలను ఖరారు చేసిన అధికారులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 25, 2025
    11:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన కాళేశ్వరం, వేములవాడ, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    వరంగల్ రీజియన్ పరిధిలోని వివిధ డిపోల నుంచి మొత్తం 255 బస్సులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

    హనుమకొండ నుండి వివిధ ప్రాంతాలకు ప్రయాణించేందుకు ప్రత్యేక బస్సుల ఛార్జీలను ఇప్పటికే ఖరారు చేశారు.

    ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఈ ప్రత్యేక బస్సు సేవలు అందుబాటులో ఉండగా, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ విజయభాను విజ్ఞప్తి చేశారు.

    వివరాలు 

    వేములవాడకు ప్రతి 15 నిమిషాలకు బస్సు 

    మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని వరంగల్ రీజియన్ పరిధిలోని డిపోల నుంచి ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేసింది.

    రాష్ట్రంలోని ప్రఖ్యాత శైవ క్షేత్రాలైన కాళేశ్వరం, వేములవాడ, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.

    ప్రతి డిపో నుంచి పదుల సంఖ్యలో బస్సులను అందుబాటులో ఉంచి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

    ముఖ్యంగా, హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు వేములవాడకు నడిపేలా ఆర్టీసీ అధికారులు ప్రణాళిక రూపొందించారు.

    భక్తుల రద్దీకి అనుగుణంగా కాళేశ్వరం, రామప్ప, పాలకుర్తి ఆలయాలకు కూడా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

    వివరాలు 

    ప్రధాన బస్సు మార్గాలు 

    హనుమకొండ బస్టాండ్ నుంచి భూపాలపల్లి డిపో ద్వారా కాళేశ్వరం వెళ్లేందుకు 30 బస్సులు,పరకాల డిపో నుంచి 20 బస్సులు,వరంగల్-2 డిపో నుంచి 4 బస్సులు అందుబాటులో ఉంటాయి.

    మొత్తం 54 బస్సులు కాళేశ్వరం వెళ్లనున్నాయి.పాలకుర్తి ఆలయానికి వరంగల్ వన్ డిపో నుంచి 5 బస్సులు,తొర్రూరు డిపో నుంచి 14 బస్సులు నడిపి మొత్తం 19 బస్సులను అందుబాటులో ఉంచనున్నారు.

    మహబూబాబాద్ డిపో నుంచి కురవికి 41 బస్సులు, జనగామ డిపో నుంచి కొమురవెల్లికి 50 బస్సులు, హనుమకొండ డిపో నుంచి మెట్టుగుట్టకు 2 బస్సులు, వరంగల్-2 డిపో నుంచి రామప్పకు 17 బస్సులు, పరకాల డిపో నుంచి ఒక బస్సు మొత్తం 18 బస్సులు రామప్ప ఆలయానికి నడిపేలా ఏర్పాట్లు చేశారు.

    వివరాలు 

    ప్రత్యేక బస్సుల ఛార్జీలు 

    ప్రయాణికుల సౌకర్యార్థం హనుమకొండ, వరంగల్, వేములవాడ, కాళేశ్వరం, పాలకుర్తి, ఐనవోలు, కొమురవెల్లి బస్ స్టేషన్లలో ఆర్టీసీ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు.

    ప్రయాణ ఖర్చులను ముందుగానే ఖరారు చేసి, భక్తులకు అందుబాటులో ఉంచారు.

    బస్సు ఛార్జీల వివరాలు

    హనుమకొండ → కాళేశ్వరం : రూ.250

    హనుమకొండ → వేములవాడ : రూ.210

    హనుమకొండ → రామప్ప : రూ.140

    హనుమకొండ → పాలకుర్తి : రూ.90

    వరంగల్ → మెట్టుగుట్ట : రూ.50

    వరంగల్ → ఐనవోలు : రూ.50

    మహబూబాబాద్ → కురవి : రూ.30

    జనగామ → కొమురవెల్లి : రూ.100

    తొర్రూరు → పాలకుర్తి : రూ.100

    ప్రయాణికులు ఈ ప్రత్యేక బస్సు సదుపాయాన్ని ఉపయోగించుకుని మహా శివరాత్రి సందర్భంగా భక్తిశ్రద్ధలతో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని, శివుని ఆశీస్సులు పొందాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ విజయభాను ఆకాంక్షించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వరంగల్ తూర్పు

    తాజా

    Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా విజయ్ మాల్యా
    Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. 55 మరణాలు కరోనా కొత్త కేసులు
    USA: హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశం నిలిపివేత.. ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫెడరల్‌ కోర్టు ..  అమెరికా
    Stock Market: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్‌ స్టాక్ మార్కెట్

    వరంగల్ తూర్పు

    రెండోరోజు కూడా 10వ తరగతి పేపర్ లీక్! విచారణకు ఆదేశించిన విద్యాశాఖ తెలంగాణ
    10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1: వరంగల్ సీపీ రంగనాథ్ బండి సంజయ్
    తెలంగాణలో మరో 5రోజుల పాటు వర్షాలు; ఉత్తర జిల్లాల్లో వడగళ్ల వాన తెలంగాణ
    ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన షెడ్యూల్ ఇదే  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025