NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం
    తదుపరి వార్తా కథనం
    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం
    కరోనా కేసులపై కేంద్రం అలర్ట్

    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం

    వ్రాసిన వారు Stalin
    Dec 21, 2022
    10:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనాతో పలు దేశాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోజూవారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల నమూలనాలను క్రమం తప్పకుండా ట్రాక్ చేయాలని సూచించింది. దేశంలో ప్రస్తుతం వారానికి 1,200 కేసులు నమోదవుతున్నాయి.

    అలాగే.. దేశంలోని కరోనా పరిస్థితులపై సమీక్షించడానికి సీనియర్ అధికారులు, నిపుణులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం సమావేశం కానున్నారు.

    విదేశాల నుంచి వచ్చిన వారికి కూడా పాజిటివ్‌గా తేలుతుండటంతో.. కేంద్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకోనుంది.

    కరోనా

    విమానశ్రయాల్లో మరిన్ని జాగ్రత్తలు..

    గత కొన్ని వారాలుగా జపాన్, అమెరికా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బ్రెజిల్, చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో నమోదైన కేసులకు సంబంధించిన నమూనాలను సేకరించి.. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం( ఇన్సాకాగ్)కు పంపడం ద్వారా కొత్త వేరియంట్లను కనుగొనేందుకు వీలవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50కి పైగా లాబ్‌లు ఇన్సాకాగ్ పరిధిలో ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని కొన్నిరోజులుగా దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 2శాతం మంది అంతర్జాతీయ ప్రయాణీకులే ఉండటం గమనార్హం. ఈ నేఫథ్యంలో విమానశ్రయాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన పాకిస్థాన్
    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Earthquake: చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం చైనా
    Robinhood: థియేట‌ర్‌లో ఫెయిల్.. ఓటీటీలో హిట్.. రాబిన్‌హుడ్‌కు అద్భుత రెస్పాన్స్ నితిన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025