NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం
    భారతదేశం

    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం

    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 21, 2022, 10:44 am 1 నిమి చదవండి
    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం
    కరోనా కేసులపై కేంద్రం అలర్ట్

    చైనాతో పలు దేశాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోజూవారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల నమూలనాలను క్రమం తప్పకుండా ట్రాక్ చేయాలని సూచించింది. దేశంలో ప్రస్తుతం వారానికి 1,200 కేసులు నమోదవుతున్నాయి. అలాగే.. దేశంలోని కరోనా పరిస్థితులపై సమీక్షించడానికి సీనియర్ అధికారులు, నిపుణులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం సమావేశం కానున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి కూడా పాజిటివ్‌గా తేలుతుండటంతో.. కేంద్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకోనుంది.

    విమానశ్రయాల్లో మరిన్ని జాగ్రత్తలు..

    గత కొన్ని వారాలుగా జపాన్, అమెరికా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బ్రెజిల్, చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో నమోదైన కేసులకు సంబంధించిన నమూనాలను సేకరించి.. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం( ఇన్సాకాగ్)కు పంపడం ద్వారా కొత్త వేరియంట్లను కనుగొనేందుకు వీలవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50కి పైగా లాబ్‌లు ఇన్సాకాగ్ పరిధిలో ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని కొన్నిరోజులుగా దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 2శాతం మంది అంతర్జాతీయ ప్రయాణీకులే ఉండటం గమనార్హం. ఈ నేఫథ్యంలో విమానశ్రయాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    కోవిడ్

    తాజా

    ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా ప్రపంచం
    భారత్-ఆస్ట్రేలియా చివరి వన్డేలో వింత దృశ్యం ఆస్ట్రేలియా
    జాతీయ చియాగింజల దినోత్సవం: చియాగింజలు జుట్టుకు చర్మానికి చేసే మేలు చర్మ సంరక్షణ
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ హిమాచల్ ప్రదేశ్

    కోవిడ్

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నరేంద్ర మోదీ
    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; కొత్తగా 918మందికి వైరస్, నలుగురు మృతి కరోనా కొత్త మార్గదర్శకాలు
    దేశంలో 4నెలల గరిష్ఠానికి కరోనా కేసులు; కేంద్రం ఆందోళన భారతదేశం
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023