NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత
    తదుపరి వార్తా కథనం
    అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత
    అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు

    అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత

    వ్రాసిన వారు Stalin
    Feb 27, 2023
    01:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అగ్నిపథ్ పథకాన్ని దిల్లీ హైకోర్టు సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, న్యాయమూర్తి సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

    అగ్నిపథ్ పథకంలో జోక్యం చేసుకోవడానికి ఈ కోర్టుకు ఎటువంటి కారణం కనపడలేదని, అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేసినట్లు ధర్మాసనం వెల్లడించింది.

    గతేడాది జూన్ 14న అగ్నిపథ్ స్కీమ్ అమల్లోకి వచ్చింది. అనంతరం ఈ స్కీమ్‌పై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అన్ని రాష్ట్రాల్లోని కోర్టులు, సుప్రీంకోర్టులో అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా కుప్పలు, తెప్పలుగా పిటిషన్లను దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లన్నీ దిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది.

    అగ్నిపథ్

    డిసెంబర్ 15న తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు

    గతేడాది జూలైలో దిల్లీ హైకోర్టుకు పిటిషన్లను సుప్రీంకోర్టు బదిలీ చేసింది. వెంటనే విచారణ ప్రారంభించిన హైకోర్టు అగ్నిపథ్ పథకాన్ని నిలిపివేయడానికి నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వు జారీ చేయడానికి బదులుగా ఈ అంశాన్ని వింటామని తెలిపింది.

    ఈ క్రమంలో డిసెంబర్ 15న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. డిసెంబర్ 23లోపు తమ లిఖితపూర్వక సమర్పణలను దాఖలు చేయాలని వాదులు, ప్రతివాదులను కోరింది.

    జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని సైన్యంలో రిక్రూట్‌మెంట్ అనేది ముఖ్యమైన సార్వభౌమ విధి అని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సైన్యంలోకి యువ రక్తాన్ని నింపడానికి నిర్మాణాత్మక మార్పులు అవసరమని ఈ సందర్భంగా పేర్కొంది.

    ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనల విన్న హైకోర్టు అగ్నిపథ్ పథకాన్ని కొనసాగించడానికే మొగ్గు చూపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    హైకోర్టు
    ఆర్మీ

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    దిల్లీ

    స్పైస్‌జెట్: దిల్లీ-హైదరాబాద్ విమానంలో ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన, అరెస్టు చేసిన పోలీసులు విమానం
    దిల్లీలో 5.8 తీవ్రతతో భూకంపం, 30సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు భూమి
    ఎయిర్ ఇండియాకు డీజీసీఏ మరో షాక్, ఈ సారి రూ.10లక్షల ఫైన్ ఎయిర్ ఇండియా
    జేఎన్‌యూలో హై టెన్షన్: మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని చూస్తున్న విద్యార్థులపై రాళ్లదాడి నరేంద్ర మోదీ

    హైకోర్టు

    అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు ఆంధ్రప్రదేశ్
    సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు తెలంగాణ
    సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత కర్ణాటక

    ఆర్మీ

    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? హిమాచల్ ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025