NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ
    భారతదేశం

    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ

    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 23, 2023, 01:27 pm 1 నిమి చదవండి
    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ
    సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ

    దిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్‌ను గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. అంతకు ముందు పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్‌కు ఈడీ సమన్లు ​​జారీ చేసింది. దీంతో అతను ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం అతని వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో మద్యం వ్యాపారి, ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో ప్రధాన నిందితుడు సమీర్ మహేంద్రు వీడియో కాల్‌లో మాట్లాడినట్లు ఈడీ చార్జీషీట్‌లో పేర్కొంది. ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌ను విశ్వసించాలని ఈ సందర్భంగా సమీర్‌ను కేజ్రీవాల్ కోరినట్లు ఈడీ తెలిపింది.

    రెండు చార్జీషీట్లు దాఖలు చేసి, 9మందిని అరెస్టు చేసిన ఈడీ

    దిల్లీ మద్య కేసు చార్జీషీట్‌లో కేజ్రీవాల్‌ పేరును చేర్చిన కొద్దిరోజుల తర్వాత పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్‌ను ఈడీ విచారణకు పిలవడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటివరకు రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసిన ఈడీ, మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసింది. దిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ ఇతరులతో కలిసి కుట్ర పన్నారని ఈడీ అభియోగాలు మోపింది. దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బిభవ్ కుమార్‌ సహా 36 మంది నిందితులు 170 ఫోన్‌లను ధ్వంసం చేశారని ఈడీ ఛార్జీషీట్లో పేర్కొంది. వేల కోట్ల రూపాయల విలువైన 'కిక్‌బ్యాక్‌ల' సాక్ష్యాలను దాచిపెట్టడంపై బిభవ్ కుమార్‌ను ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    అరవింద్ కేజ్రీవాల్
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    ముఖ్యమంత్రి
    దిల్లీ

    అరవింద్ కేజ్రీవాల్

    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? దిల్లీ
    నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ  దిల్లీ
    నూతన సీఎస్‌గా పీకే సింగ్‌ను నియమించిన దిల్లీ ప్రభుత్వం; కేంద్రానికి ప్రతిపాదనలు  దిల్లీ
    కేజ్రీవాల్ సర్కారు భారీ విజయం; దిల్లీలో పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వాదేనని సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    ఆప్‌ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు  దిల్లీ
    దిల్లీ మద్యం పాలసీ కేసు: ఛార్జిషీట్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చిన ఈడీ  దిల్లీ
    ఏపీలో 'బీఆర్ఎస్‌'కు షాకిచ్చిన ఈసీ; జాతీయ స్థాయిలో 'ఆప్‌'కు ప్రమోషన్  ఎన్నికల సంఘం
    నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత అస్సాం/అసోం

    ముఖ్యమంత్రి

    కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: 24మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం కర్ణాటక
    కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కర్ణాటక
    గుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్  ఆంధ్రప్రదేశ్
    'తమిళనాడులో పాలు సేకరించకుండా అమూల్‌ను నియంత్రిచండి': అమిత్ షాకు స్టాలిన్ లేఖ తమిళనాడు

    దిల్లీ

    భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు ఐఎండీ
    పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు  రాహుల్ గాంధీ
    ఫోన్ సిగ్నల్ అందకపోవడంతో ప్రగతి మైదాన్ సొరంగంలో గాయపడిన బైకర్ మృతి ఉత్తర్‌ప్రదేశ్
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023