NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ
    సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ

    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ

    వ్రాసిన వారు Stalin
    Feb 23, 2023
    01:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్‌ను గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది.

    అంతకు ముందు పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్‌కు ఈడీ సమన్లు ​​జారీ చేసింది. దీంతో అతను ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం అతని వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు.

    దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో మద్యం వ్యాపారి, ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో ప్రధాన నిందితుడు సమీర్ మహేంద్రు వీడియో కాల్‌లో మాట్లాడినట్లు ఈడీ చార్జీషీట్‌లో పేర్కొంది. ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌ను విశ్వసించాలని ఈ సందర్భంగా సమీర్‌ను కేజ్రీవాల్ కోరినట్లు ఈడీ తెలిపింది.

    ఈడీ

    రెండు చార్జీషీట్లు దాఖలు చేసి, 9మందిని అరెస్టు చేసిన ఈడీ

    దిల్లీ మద్య కేసు చార్జీషీట్‌లో కేజ్రీవాల్‌ పేరును చేర్చిన కొద్దిరోజుల తర్వాత పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్‌ను ఈడీ విచారణకు పిలవడం గమనార్హం.

    ఈ కేసులో ఇప్పటివరకు రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసిన ఈడీ, మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసింది.

    దిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ ఇతరులతో కలిసి కుట్ర పన్నారని ఈడీ అభియోగాలు మోపింది.

    దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బిభవ్ కుమార్‌ సహా 36 మంది నిందితులు 170 ఫోన్‌లను ధ్వంసం చేశారని ఈడీ ఛార్జీషీట్లో పేర్కొంది. వేల కోట్ల రూపాయల విలువైన 'కిక్‌బ్యాక్‌ల' సాక్ష్యాలను దాచిపెట్టడంపై బిభవ్ కుమార్‌ను ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    అరవింద్ కేజ్రీవాల్
    ముఖ్యమంత్రి

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    దిల్లీ

    రిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం గణతంత్ర దినోత్సవం
    విమానంలో మూత్ర విసర్జన కేసు: ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ ఎయిర్ ఇండియా
    దిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్ గవర్నర్
    ఫెడరేషన్ పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు: డబ్య్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ భారతదేశం

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ

    అరవింద్ కేజ్రీవాల్

    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు దిల్లీ
    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    ముఖ్యమంత్రి

    వచ్చే ఏడాది నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ తరగతులు: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ధన్‌బాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం జార్ఖండ్
    ఆంధ్రప్రదేశ్: మూడు రాజధానుల అంశంపై ఈనెల 23న సుప్రీంకోర్టులో విచారణ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025