NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్: 2020లో సాహిల్, నిక్కీకి పెళ్లి; మ్యారేజ్ సర్టిఫికెట్ లభ్యం
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్: 2020లో సాహిల్, నిక్కీకి పెళ్లి; మ్యారేజ్ సర్టిఫికెట్ లభ్యం
    దిల్లీ హత్య కేసులో ట్విస్ట్: 2020లోనే సాహిల్,నిక్కీకి పెళ్లి

    దిల్లీ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్: 2020లో సాహిల్, నిక్కీకి పెళ్లి; మ్యారేజ్ సర్టిఫికెట్ లభ్యం

    వ్రాసిన వారు Stalin
    Feb 18, 2023
    11:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిక్కీ యాదవ్ హత్య కేసులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలైన నిక్కీకి, నిందితుడు సాహిల్‌కు 2020లో పెళ్లి జరిగింది. వివాహానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నోయిడాలోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది.

    సాహిల్ తన ప్రియురాలైన నిక్కీని ఫిబ్రవరి 9న రాత్రి హత్య చేసి, మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచి, అదేరోజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఫిబ్రవరి 14న ఈవిషయం వెలుగులోకి వచ్చింది.

    నిక్కీని పెళ్లి చేసుకోవడం సాహిల్ కుటుంబ సభ్యులకు ఇష్టంలేదు. ఈక్రమంలో 2022లో మరో అమ్మాయితో పెళ్లి చేయాలని సాహిల్ కుటుంబసభ్యులు నిర్ణయించారు. సాహిల్‌తో పెళ్లి జరిగిన విషయాన్ని నిక్కీ కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచిపెట్టారు.

    హత్య

    సాహిల్ తండ్రిని అరెస్టు చేసిన దిల్లీ పోలీసులు

    నిక్కీ హత్యలో సాహిల్‌‌కు సహాయం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో అతని తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. సాహిల్‌ స్నేహితులు, కుటుంబ సభ్యులు నిక్కీ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

    ఈ క్రమంలో సాహిల్ తండ్రి వీరేందర్‌సింగ్, అతని ఇద్దరు సోదరులు, ఇద్దరు స్నేహితులను దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న సాహిల్ నేరాన్ని అంగీకరించాడు.

    ఫిబ్రవరి 10న తనకు పెళ్లి జరగనుందని నిక్కీకి తెలియడంతో సాహిల్‌ను నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సాహిల్ తన కారులో ఉంచిన డేటా కేబుల్‌తో నిక్కీ గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె ఫోన్‌లోని తనకు సంబంధించిన డేటాను తొలగించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    దిల్లీ

    దిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా.. రోడ్డు ప్రమాదం
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు బిహార్
    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు అరవింద్ కేజ్రీవాల్
    ప్యారిస్-ఢిల్లీ: ప్రయాణికుల వికృత చేష్టలను దాచిపెట్టిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ సీరియస్ ఎయిర్ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025