రెజ్లర్లు అనుచిత వ్యాఖ్యలు చేయలేదు; కోర్టుకు తెలిపిన దిల్లీ పోలీసులు
రెజ్లర్లు ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడలేదని శుక్రవారం దిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తప్పుడు ఆరోపణలు చేశారని, విద్వేషపూరిత ప్రసంగానికి పాల్పడ్డారని కోర్టులో పిటిషన్ దాఖలైంది. 'అటల్ జన్ పార్టీ' జాతీయ చీఫ్ అని చెప్పుకునే బామ్ బామ్ మహారాజ్ నౌహతియా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదుదారు అందించిన వీడియో సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత, రెజ్లర్లు ఎటువంటి విద్వేషపూరిత నివాదాలు చేయలేదని, ప్రసంగాలకు పాల్పడలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అందువల్ల ఈ దరఖాస్తును కొట్టివేయాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. మరోవైపు తదుపరి వాదనలను జూలై 7న కోర్టు వాయిదా వేసింది.