NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Melting of icebergs: భూతాపం ప్రభావం.. మంచుకొండల కరుగుదలతో ముంచుకొస్తున్న పెను ముప్పు
    తదుపరి వార్తా కథనం
    Melting of icebergs: భూతాపం ప్రభావం.. మంచుకొండల కరుగుదలతో ముంచుకొస్తున్న పెను ముప్పు
    భూతాపం ప్రభావం.. మంచుకొండల కరుగుదలతో ముంచుకొస్తున్న పెను ముప్పు

    Melting of icebergs: భూతాపం ప్రభావం.. మంచుకొండల కరుగుదలతో ముంచుకొస్తున్న పెను ముప్పు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 27, 2024
    09:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వాతావరణ మార్పుల ప్రభావంతో భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో హిమాలయ ప్రాంతంలోని హిమానదాల కరుగుదలకి దారితీస్తోంది.

    నీరు హిమానదాల పరిధిని పెంచుతూ, జలాశయాల విస్తీర్ణం గణనీయంగా పెంచుతోంది.

    అయితే ఈ జలాశయాలు కట్టలు తెంచుకునే ప్రమాదం పొంచి ఉండటంతో దిగువన నివసించే ప్రజలు, జీవజాతులు, రోడ్లు, ఆనకట్టలు వంటి మౌలిక వసతులకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం పెరుగుతోంది.

    తాజా అధ్యయనాల ప్రకారం లద్దాఖ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని 67 హిమానద జలాశయాల ఉపరితల వైశాల్యం గత 13 ఏళ్లలో 40 శాతం పెరిగింది.

    ఈ విషయాన్ని గమనించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికార సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

    Details

    వాతావరణ మార్పులపై తక్షణమే స్పందించాలి

    మార్చి 10కి వారం ముందు తమ సమాధానాలను సమర్పించాలని ఆదేశించింది. హిమానదాల విస్తీర్ణం 2011-2024 మధ్యకాలంలో 33.7 శాతం పెరిగినట్టు సమాచారం.

    ఈ పరిణామం భారత జీవ వైవిధ్య చట్టం, జల కాలుష్య నివారణ చట్టాలకు విరుద్ధంగా ఉండటమే కాకుండా, పర్యావరణానికి తీవ్ర ప్రభావం చూపే ప్రమాదాన్ని సూచిస్తోంది.

    భూతాపం వల్ల హిమనదాల ఉపరితల వైశాల్యం 10.81 శాతం పెరగడాన్ని గడచిన 13 ఏళ్లలో గుర్తించారు. హిమానదాల కరుగుదలపై నిరంతర పరిశోధనలు చేపట్టి నివారణ చర్యలను చేపట్టాలి.

    హిమానద జలాశయాల పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాసం కల్పించాలి. జీవ వైవిధ్య రక్షణ, కాలుష్య నియంత్రణ చట్టాలను కచ్చితంగా పాటించాలి.

    వాతావరణ మార్పులకు తక్షణం స్పందించకపోతే మానవజాతి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లద్దాఖ్
    అరుణాచల్ ప్రదేశ్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    లద్దాఖ్

    డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన  చైనా
    భూమిని తాకిన అయస్కాంత తుఫాను; లద్దాఖ్‌లో అబ్బురపరిచిన అరోరా దృశ్యాలు భూమి
    జమ్ముకశ్మీర్ చరిత్రను తెలిపేందుకు ఐసీహెచ్ఆర్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్‌ జమ్ముకశ్మీర్
    పాంగాంగ్ సరస్సుకు రాహుల్ గాంధీ బైక్ రైడ్; స్టైలిష్ లుక్‌లో కాంగ్రెస్ నేత  రాహుల్ గాంధీ

    అరుణాచల్ ప్రదేశ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం రాజ్‌నాథ్ సింగ్
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు
    'భారతదేశంలో అరుణాచల్ అంతర్భాగం'; చైనా సరిహద్దును మెక్‌మహన్ రేఖగా గుర్తిస్తూ అమెరికా తీర్మానం చైనా
    అరుణాచల్ ప్రదేశ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్; పైలట్ల కోసం గాలింపు హెలికాప్టర్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025