NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: మహిళా ఉద్యోగుల హక్కులకు గుర్తింపుగా దేశంలో మొదటి బస్‌ డిపో
    తదుపరి వార్తా కథనం
    Delhi: మహిళా ఉద్యోగుల హక్కులకు గుర్తింపుగా దేశంలో మొదటి బస్‌ డిపో
    మహిళా ఉద్యోగుల హక్కులకు గుర్తింపుగా దేశంలో మొదటి బస్‌ డిపో

    Delhi: మహిళా ఉద్యోగుల హక్కులకు గుర్తింపుగా దేశంలో మొదటి బస్‌ డిపో

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 16, 2024
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్ర రవాణా మంత్రి కైలాశ్ గహ్లోత్ దిల్లీలో సరోజిని నగర్ వద్ద దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను ప్రారంభించారు.

    పూర్తిస్థాయి మహిళా సిబ్బందితో పనిచేసే ఈ డిపోకు 'సఖి డిపో' అని పేరు పెట్టారు. డిపో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా మొత్తం 225 మంది మహిళా సిబ్బందితో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.

    మహిళలు ఇప్పటికే బస్ కండక్టర్లుగా తమ ప్రతిభను చాటుతుండగా, ఇప్పుడు డ్రైవర్లుగా పనిచేయడం ద్వారా రవాణా రంగంలో కొత్త మైలురాయిని చేరుకోవచ్చని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

    ఇది దేశంలో మహిళా సాధికారతకు కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని పేర్కొన్నారు.

    Details

    మహిళా ఉద్యోగుల సమస్యలపై మంత్రి స్పందన

    సమయానుకూలమైన సౌకర్యాలు, స్థిరమైన ఉద్యోగాలు, 'ఫిక్స్‌డ్ జీతం' కోసం తమ డిమాండ్లను ఉద్యోగులు వెల్లడించారు.

    ఉదయం 6 గంటలకే బయల్దేరి ప్రయాణించాల్సి వస్తోందని, సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు.

    మహిళా ఉద్యోగుల సమస్యలు విన్న మంత్రి మెరుగైన వసతులు కల్పించేందుకు, అలాగే వారి డిమాండ్లపై చర్యలు తీసుకోవడానికి హామీ ఇచ్చారు.

    ఈ డిపోతో మహిళా సాధికారతకు కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని మంత్రి పేర్కొన్నారు. భారత్‌లో మహిళా సాధికారతకు చిరునామాగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని రవాణా శాఖ వ్యక్తం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఉద్యోగులు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    దిల్లీ

    PM E-DRIVE: పీఎం ఇ- డ్రైవ్‌ పథకం ద్వారా టూ వీలర్‌కు గరిష్ఠంగా రూ.10 వేలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం
    Cocaine Seized: దిల్లీలో కలకలం రేపిన డ్రగ్స్.. రూ.2వేల కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం ఇండియా
    Delhi: ఢిల్లీలోని జైత్‌పూర్‌లో దారుణ ఘటన.. వైద్యుడిని కాల్చిచంపిన ఇద్దరు మైనర్లు.. హత్య
    CM Chandrababu: వామపక్ష తీవ్రవాద నిర్మూలనపై కేంద్రంతో కీలక సమావేశం.. ఇవాళ దిల్లీకి చంద్రబాబు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఉద్యోగులు

    ట్విటర్ విలువను US$20 బిలియన్లుగా ప్రకటించిన ఎలోన్ మస్క్ ట్విట్టర్
    ఉద్యోగుల తొలగింపులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఫ్లిప్ కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫ్లిప్‌కార్ట్
    2022-23కి 8.15% వడ్డీ రేటును నిర్ణయించిన ప్రావిడెంట్ ఫండ్ విభాగం EPFO ప్రభుత్వం
    AI వలన 70% ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయంటున్న గోల్డ్‌మన్ సాచ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025