
TDP-Janasena: నేడు టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ జాబితాలో దాదాపు 60-70 మంది పేర్లు ఉంటాయని కూటమి వర్గాలు తెలిపాయి.
వైసీపీ ప్రచారాన్ని ముమ్మరం చేసిన నేపేథ్యంలో.. అభ్యర్థుల ప్రకటన విషయంలో ఇక జాప్యం చేయొద్దని అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ భావించినట్లు తెలుస్తోంది.
శనివారం తొలి జాబితాను ప్రకటించడం ద్వారా.. టీడీపీ ప్రచారంలో ఊపు తీసుకురావాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, అభ్యర్థులను ప్రకటించడానికి ముందు.. ఇరు పార్టీల నేతలు తమ జిల్లాల ఇన్చార్జ్లతో సమావేశం కానున్నారు.
బీజేపీతో పొత్తుపై అధికారికంగా ప్రకటన వెలువడిన తర్వాత రెండో జాబితాను త్వరలో ప్రకటిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఉదయం 11:40గంటలకు అభ్యర్థుల ప్రకటన
ఇవాళ టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదల.
— BIG TV Breaking News (@bigtvtelugu) February 24, 2024
60-70 అసెంబ్లీ స్థానాలపై ప్రకటన ఉండే అవకాశం.
టీడీపీ నుంచి 50 నుంచి 70 లోపు జనసేన నుంచి12 నుండి 18 వరకు స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన.
ఉదయం 11.40 కి జాబితా విడుదల చేయనున్న చంద్రబాబు-పవన్.
ఉదయం 9 గంటలకు ముఖ్య నేతలతో చంద్రబాబు… pic.twitter.com/SvLBZrkwhx