NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేరళను వణికిస్తున్న నిఫా వైరస్.. ఐదుకు చేరిన కేసులు.. లక్షణాలు ఇవే 
    తదుపరి వార్తా కథనం
    కేరళను వణికిస్తున్న నిఫా వైరస్.. ఐదుకు చేరిన కేసులు.. లక్షణాలు ఇవే 
    కేరళను వణికిస్తున్న నిఫా వైరస్.. ఐదుకు చేరిన కేసులు.. లక్షణాలు ఇవే

    కేరళను వణికిస్తున్న నిఫా వైరస్.. ఐదుకు చేరిన కేసులు.. లక్షణాలు ఇవే 

    వ్రాసిన వారు Stalin
    Sep 14, 2023
    11:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నిఫా వైరస్ కేరళను వణికిస్తోంది. రాష్ట్రంలో తాజాగా మరో పాజిటివ్ కేసు నమోదైనట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

    కోజికోడ్‌లోని 24ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు మంత్రి వెల్లడించారు. దీంతో కేరళలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకి చేరుకుంది.

    ప్రస్తుతానికి 706మంది కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారు. వీరిలో 77మంది హై-రిస్క్ కేటగిరీ ఉండగా, 153మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారని తెలిపారు.

    వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

    యంత్రాంగాలను సమన్వయం చేసేందుకు 19కోర్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఐసోలేషన్‌లో ఉన్న వారికి నిత్యావసరాలను అందించేందుకు వలంటీర్లను నియమించింది.

    కేరళ

    నిపా వైరస్ అంటే ఏమిటి? లక్షణాల ఎలా ఉంటాయి?

    నిఫా అనేది జూనోటిక్ వైరస్. జంతువుల (గబ్బిలాలు లేదా పందులు వంటివి) నుంచి ఈ వైరస్ మానవులకు వ్యాపిస్తుంది.

    ఇది కలుషితమైన ఆహారం ద్వారా లేదా నేరుగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు వ్యాపిస్తుంది.

    టెరోపోడిడే కుటుంబానికి చెందిన గబ్బిలాల్లో నిఫా వైరస్‌కు ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

    నిపా వైరస్ సోకిన వ్యక్తుల్లో కొద్దిపాటి లక్షణాలతో పాటు తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం, ప్రాణాంతక ఎన్సెఫాలిటిస్ వరకు దారి తీయొచ్చు.

    ఈ వైరస్ పందుల వంటి జంతువులలో కూడా తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది.

    వ్యాధి సోకిన వ్యక్తులకు మొదట్లో జ్వరం, తలనొప్పి, మైయాల్జియా (కండరాల నొప్పి), వాంతులు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.

    వైరస్

    వైరస్ మరణాల రేటు 40శాతం - 75శాతం 

    నిఫా వైరస్ మానవ శరీరంలోకి వెళ్లిన 4 నుంచి 14 రోజుల కాలంలో తన ప్రభావాన్ని పూర్తిస్థాయిలో చూపిస్తుంది.

    నిఫా వైరస్ మరణాల రేటు 40శాతం నుంచి 75శాతం వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

    వైరస్ నుంచి చాలా మంది వ్యక్తులు పూర్తిగా కోలుకుంటారు. వీరు దీర్ఘకాలిక నరాల సంబంధిత రుగ్మతలతో బాధపడుతుంటారని నివేదికలు చెబుతున్నాయి.

    దాదాపు 20% మంది రోగులు మూర్ఛ రుగ్మత, నాడీ సంబంధిత రోగాలతో ఇబ్బంది పడుతుంటారు.

    వైరస్ సోకిన కొంత మంది వ్యక్తులు న్యుమోనియా, తీవ్రమైన శ్వాసకోశ సమస్యల బారిన పడవచ్చు.

    వైరస్

    వైరస్ కట్టడికి కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటు

    వైరస్ సోకిన వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించడంతో పాటు వారిని ఐసోలేషల్‌లో ఉంచేందుకు పరిపాలన యంత్రాంగం తీవ్రమైన కృష్టి చేస్తోందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు. హెల్త్ అడ్మినిస్ట్రేషన్ క్లినికల్ లక్షణాలను పర్యవేక్షిస్తోందని చెప్పారు.

    కోజికోడ్ జిల్లాలోని ఏడు గ్రామ పంచాయతీలు అటాన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపరలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించినట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు.

    ఇన్ఫెక్షన్ వ్యాప్తిని పరిమితం చేయడానికి కంటైన్‌మెంట్ జోన్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

    కంటైన్‌మెంట్ జోన్‌లోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ఇంటి నుంచే తరగతులకు హాజరయ్యేలా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టి పబ్లిక్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను ఆదేశించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిఫా వైరస్
    కేరళ
    తాజా వార్తలు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    నిఫా వైరస్

    కేరళను బెంబెలెత్తిస్తోన్న నిఫా వైరస్.. ఇద్దరు మృతి భారతదేశం
    కేరళలో నిఫా వైరస్ కలకలం.. ఏడు గ్రామాల్లో పాఠశాలలు, బ్యాంకులు మూసివేత  కేరళ

    కేరళ

    కేరళ రైలు అగ్నిప్రమాదం కేసులో నిందితుడి అరెస్టు తాజా వార్తలు
    బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ బీజేపీ
    SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంధనం
    దేశంలోనే మొదటి 'వాటర్ మెట్రో' కేరళలో ఏర్పాటు; దాని విశేషాలను తెలుసుకోండి  మెట్రో స్టేషన్

    తాజా వార్తలు

    India-Middle East-Europe corridor: 'భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్' కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం  జీ20 సదస్సు
    Morocco earthquake: మొరాకోలో భూకంప కల్లోలం.. 2,000 దాటిన మృతులు.. వెల్లువెత్తున్న మానవాతా సాయం మొరాకో
    దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ పూజలు  రిషి సునక్
    సెప్టెంబర్ 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం  ఫ్రీ ఫైర్ మాక్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025