NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బిహార్ కుల గణన ఫలితాలు విడుదల.. ఓబీసీల జనాభా 63%.. రాష్ట్రంలో యాదవులే టాప్ 
    తదుపరి వార్తా కథనం
    బిహార్ కుల గణన ఫలితాలు విడుదల.. ఓబీసీల జనాభా 63%.. రాష్ట్రంలో యాదవులే టాప్ 
    బిహార్ కుల గణన ఫలితాలు విడుదల.. ఓబీసీల జనాభా 63%.. రాష్ట్రంలో యాదవులే టాప్

    బిహార్ కుల గణన ఫలితాలు విడుదల.. ఓబీసీల జనాభా 63%.. రాష్ట్రంలో యాదవులే టాప్ 

    వ్రాసిన వారు Stalin
    Oct 02, 2023
    03:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కుల ఆధారిత సర్వే ఫలితాలను విడుదల చేసిన మొదటి రాష్ట్రంగా బిహార్ అవతరించింది.

    బిహార్‌లో నిర్వహించిన కుల గణన సర్వే నివేదికను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. రాష్ట్ర మొత్తం జనాభా 13 కోట్లకు పైగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

    రాష్ట్ర జనాభాలో ఓబీసీలు 63 శాతం ఉన్నారని జనాభా గణన వెల్లడించింది.

    జనాభాలో 36 శాతం అత్యంత వెనుకబడిన తరగతులు, 27.1 శాతం వెనుకబడిన తరగతులు, 19.7 శాతం షెడ్యూల్డ్ కులాలు, 1.7 శాతం షెడ్యూల్డ్ టైబ్స్, జనరల్ కేటగిరీకి చెందిన జనభా 15.5 శాతం ఉన్నట్లు నివేదిక చెబుతోంది.

    2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బిహార్ ప్రభుత్వం ఈ నివేదికను విడుదల చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నది.

    బిహార్

    ఓబీసీల్లో యాదవుల వాటా 14.27 శాతం

    బిహార్ జనాభాలో భూమిహార్లు 2.86శాతం, బ్రాహ్మణులు 3.66శాతం, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సామాజిక వర్గానికి చెందిన కుర్మీలు 2.87 శాతం, ముసహర్‌లు 3 శాతం ఉన్నట్లు నివేదిక తేల్చింది.

    ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు చెందిన యాదవులు రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం ఓబీసీలు 63.1శాతం ఉండగా, అందులో యాదవుల వాటా14.27శాతంగా సర్వే పేర్కొంది.

    కుల గణన సర్వేను విడుదల అనంతరం సీఎం నితీష్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

    గాంధీ జయంతి సందర్భంగా డేటాను విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

    బిహార్‌లో కుల ప్రాతిపదికన జనాభా గణనకు సంబంధించి త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని చేయనున్నట్లు పేర్కొన్నారు.

    ఇది చారిత్రాత్మక ఘట్టమని ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ అన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సర్వే నివేదికను వెల్లడిస్తున్న అధికారులు

    The report of the caste-based census conducted in Bihar has been released. Backward class in Bihar is 27.13%. The extremely backward class is 36.01%, General category is 15.52%. The total population of Bihar is more than 13 crores: Vivek Kumar Singh, Additional Chief Secretary,… pic.twitter.com/SWlpjyWF9C

    — ANI (@ANI) October 2, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నితీష్ కుమార్ ట్వీట్

    आज गांधी जयंती के शुभ अवसर पर बिहार में कराई गई जाति आधारित गणना के आंकड़े प्रकाशित कर दिए गए हैं। जाति आधारित गणना के कार्य में लगी हुई पूरी टीम को बहुत-बहुत बधाई !

    जाति आधारित गणना के लिए सर्वसम्मति से विधानमंडल में प्रस्ताव पारित किया गया था।…

    — Nitish Kumar (@NitishKumar) October 2, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్
    నితీష్ కుమార్
    ముఖ్యమంత్రి
    లాలూ ప్రసాద్ యాదవ్

    తాజా

    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం

    బిహార్

    స్టార్టప్‌తో రిక్షా పుల్లర్ అద్భుతం; ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలిస్తున్నాడు తాజా వార్తలు
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    పీఎఫ్‌ఐ విచారణ: బిహార్, యూపీ, పంజాబ్, గోవాలో ఎన్‌ఐఏ దాడులు ఎన్ఐఏ

    నితీష్ కుమార్

    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ తేజస్వీ యాదవ్
    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా?  బిహార్

    ముఖ్యమంత్రి

    'తమిళనాడులో పాలు సేకరించకుండా అమూల్‌ను నియంత్రిచండి': అమిత్ షాకు స్టాలిన్ లేఖ తమిళనాడు
    గుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్  ఆంధ్రప్రదేశ్
    కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కర్ణాటక
    నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ  అరవింద్ కేజ్రీవాల్

    లాలూ ప్రసాద్ యాదవ్

    జాబ్ స్కామ్ కేసు: రబ్రీ దేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు సీబీఐ
    జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం బిహార్
    IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు రాష్ట్రీయ జనతా దళ్/ఆర్జేడీ
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు తేజస్వీ యాదవ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025