NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బెంగుళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల రెండో దఫా సమావేశం వాయిదా; కారణం ఇదే
    తదుపరి వార్తా కథనం
    బెంగుళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల రెండో దఫా సమావేశం వాయిదా; కారణం ఇదే
    బెంగుళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల రెండో దఫా సమావేశం వాయిదా; కారణం ఇదే

    బెంగుళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల రెండో దఫా సమావేశం వాయిదా; కారణం ఇదే

    వ్రాసిన వారు Stalin
    Jul 03, 2023
    01:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరులో జులై 13, 14తేదీల్లో జరగాల్సిన ప్రతిపక్షాల రెండోదఫా సమావేశం వాయిదా పడింది. సమావేశాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని జనతాదళ్ (యునైటెడ్) ముఖ్య అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు. అయితే ప్రతిపక్ష పార్టీల సమావేశం వాయిదా పడటానికి కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

    జూన్ 23న బిహార్‌లోని పాట్నలో ప్రతిపక్షాల సమావేశం విజయవంతమైంది. ఆ సమయంలో జులై 10, 12తేదీల్లో సిమ్లాలో రెండో దఫా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.

    అయితే భారీ వర్షాల కారణంగా సమావేశం వేదికను సిమ్లా నుంచి బెంగళూరుకు మార్చారు.

    సమావేశాన్ని వాయిదా వేయడానికి పార్లమెంట్‌తో పాటు పలు రాష్ట్రాల్లో వర్షాకాల సమావేశాల నిర్వహణ, మహారాష్ట్రలో ఎన్‌సీపీ సంక్షోభం కారణాలు తెలుస్తోంది.

    ప్రతిపక్షాలు

    సెప్టెంబర్‌లో రెండో దఫా సమావేశం?

    పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11న ముగుస్తాయి.

    జులై 10నుంచి 14వరకు బిహార్ శాసనసభ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.

    కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెలలో నిర్వహించాలని ఆలోచిస్తోంది.

    బిహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తాము వర్షాకాల సమావేశాల్లో బిజీగా ఉన్నామని బెంగళూరులో విపక్షాల సమావేశాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరారు.

    కర్ణాటకలో కూడా వర్షాకాల సమావేశాన్ని నిర్వహించబోతున్నందున వాయిదా వేయాలని తమ కేంద్ర నాయకత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ కోరింది.

    ఎన్సీపీ సంక్షోభం నేపథ్యంలో శరద్ పవార్ కూడా హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

    ఈ నేపథ్యంలో రెండోదఫా సమావేశం సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు
    కాంగ్రెస్
    బిహార్
    పాట్న

    తాజా

    Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు! వేసవి కాలం
    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి
    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ జ్యోతి మల్హోత్రా
    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు

    బెంగళూరు

    భారతీయ సోషల్ మీడియా యాప్ స్లిక్ మైనర్ల యూజర్ డేటాను బహిర్గతం చేసింది టెక్నాలజీ
    HLFT-42 యుద్ధ విమానంపై హనుమతుడి బొమ్మ తొలగింపు యుద్ధ విమానాలు
    భారతదేశంలో 2 ట్విట్టర్ కార్యాలయాలను మూసేసిన తర్వాత, ముగ్గురు ఉద్యోగులు మిగిలారు ట్విట్టర్
    శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణం: 1000కోట్ల స్వాహా కేసులో ఒకరు అరెస్టు కర్ణాటక

    కాంగ్రెస్

    రాజీవ్ గాంధీ వర్ధంతి: సోనియా, ఖర్గే, ప్రియాంక నివాళి; రాహుల్ భావోద్వేగ ట్వీట్  రాహుల్ గాంధీ
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    మోదీ 9 ఏళ్ళ పాలన..ఈ 9 ప్రశ్నలకి సమాధానం చెప్పాలని అడుగుతున్న కాంగ్రెస్ నరేంద్ర మోదీ
    బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్  ఈటల రాజేందర్

    బిహార్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్ భారతదేశం
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు దిల్లీ

    పాట్న

    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర
    'వన్ ఆన్ వన్' వ్యూహం: 450లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల నుంచి బీజేపీపై ఒక్కరే పోటీ  లోక్‌సభ
    పాట్నాలో జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి కేసీఆర్‌ను ఆహ్వానించలేదు: తేజస్వీ యాదవ్ బిహార్
    బిహార్: రేపు పాట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశానికి రంగం సిద్ధం బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025