Page Loader
NEET-UG Result: నీట్-యూజీలో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి రీ-ఎగ్జామినేషన్‌లో ఎన్ని మార్కులు వచ్చాయంటే..
నీట్-యూజీలో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి రీ-ఎగ్జామినేషన్‌లో ఎన్ని మార్కులు వచ్చాయంటే..

NEET-UG Result: నీట్-యూజీలో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి రీ-ఎగ్జామినేషన్‌లో ఎన్ని మార్కులు వచ్చాయంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2024
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ రీ-ఎగ్జామినేషన్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది.ఈ పరీక్ష 1563 మంది అభ్యర్థులకు మాత్రమే నిర్వహించారు. అయితే 813మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.రీ-టెస్ట్‌లో హాజరైన అభ్యర్థులు NTA అధికారిక వెబ్‌సైట్ exam.nta.ac.inని సందర్శించడం ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం,రీ-ఎగ్జామినేషన్‌లో టాపర్ 680మార్కులు పొందారు.అదే విద్యార్థి మునుపటి పరీక్షలో 720మార్కులు పొందారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత,1567 మంది అభ్యర్థులు మళ్లీ పరీక్షకు హాజరు కావడానికి లేదా గ్రేస్ మార్కులు లేకుండా ఫలితాన్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంది. 1567మంది అభ్యర్థుల్లో ఆరుగురు టాపర్లు కూడా ఉన్నారు.అందులో ఐదుగురు మళ్లీ పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన ఐదుగురిలో ఒకరు అత్యధికంగా 680 మార్కులు సాధించారు.

వివరాలు 

ఇప్పుడు 61 మంది టాపర్లు మాత్రమే మిగిలారు 

ఇంతకుముందు జరిగిన నీట్ యూజీ పరీక్ష ఫలితాల్లో 67 మంది అభ్యర్థులు టాపర్లు కాగా, రీ-ఎగ్జామినేషన్‌ పరీక్ష తర్వాత ఇప్పుడు 61 మంది టాపర్లు మాత్రమే మిగిలారు. టై బ్రేక్‌లో 44 మంది అభ్యర్థులు టాపర్లుగా నిలిచారు. కాగా 813 మంది అభ్యర్థుల్లో ఎవరూ 720/720 మార్కులు సాధించలేకపోయారు. ఇప్పుడు రీ-నీట్ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు జూలై 6న జరిగే కౌన్సెలింగ్‌లో పాల్గొంటారు.

వివరాలు 

టై బ్రేక్ థియరీ అంటే ఏమిటి? 

ఈసారి NEET UG పరీక్షలో, కొత్త, పాత NCERT పుస్తకాల ప్రకారం వేర్వేరు సమాధానాలతో కూడిన ప్రశ్నపత్రం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష అనంతరం విద్యార్థులు దీనిపై ప్రశ్నలు సంధించారు. అదే సమయంలో, NTA రెండు సమాధానాలను సరైనదిగా పరిగణించింది. టై బ్రేకర్ ఆధారంగా 716 మార్కులు పొందిన 44 మంది అభ్యర్థుల సంఖ్యను 720 చేశారు. ఇది జరగకపోతే టాపర్ల సంఖ్య 17 మాత్రమే.