Page Loader
Gang Rape Case: బాధితురాలిని ఫస్ట్ డే నుంచే లక్ష్యంగా పెట్టుకున్నారు.. కోల్‌కతా ఘటనపై పోలీసుల నివేదిక!
బాధితురాలిని ఫస్ట్ డే నుంచే లక్ష్యంగా పెట్టుకున్నారు.. కోల్‌కతా ఘటనపై పోలీసుల నివేదిక!

Gang Rape Case: బాధితురాలిని ఫస్ట్ డే నుంచే లక్ష్యంగా పెట్టుకున్నారు.. కోల్‌కతా ఘటనపై పోలీసుల నివేదిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 30, 2025
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతా లా కాలేజ్‌ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు. మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరిలో ముగ్గురు ఈ దారుణానికి ముందుగానే కుట్ర పన్నారని పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించింది. నలుగురు నిందితుడు కళాశాలలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డు కాగా, ప్రధాన నిందితుడు బాధితురాలిని ఆమె కళాశాలలో అడ్మిషన్ తీసుకున్న మొదటి రోజు నుంచే లక్ష్యంగా పెట్టుకున్నాడని అధికారులు తెలిపారు. తొమ్మిది మంది సభ్యులతో కూడిన SIT ఈ కేసును విచారిస్తోంది. మోనోజిత్ మిశ్రా, ప్రతిమ్ ముఖర్జీ, జైద్ అహ్మద్ అనే ముగ్గురు నిందితులు గతంలోనూ కళాశాలలోని మరికొన్ని విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లుగా తేలింది.

Details

వీడియో క్లిప్ ఉన్నట్లు అనుమానం

ఈ ముగ్గురు యువతులను ముందుగానే టార్గెట్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించేవారు. తమ మొబైల్ ఫోన్లలో ఫుటేజ్ రికార్డ్ చేసి, ఆ తర్వాత వాటిని చూపించి బాధితులను బెదిరించేవారని అధికారులు తెలిపారు. ఇప్పటికే కోల్‌కతా పోలీసులు నిందితుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని వాటిలో వీడియోలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా జూన్ 25న జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం నిందితుల్లో ఇద్దరైన ముఖర్జీ, అహ్మద్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఆయా వీడియోలు ఎవరైనా ఫార్వార్డ్ చేశారా? గ్రూపుల్లో పంచుకున్నారా? అనే కోణంలో ప్రస్తుతం అధికారులు ముమ్మరంగా విచారణ చేపట్టారు.