Loading...
PM Modi: ప్రపంచం భారత్‌ వైపు చూస్తోంది.. యువతకు కొత్త అవకాశాలు: మోదీ
ప్రపంచం భారత్‌ వైపు చూస్తోంది.. యువతకు కొత్త అవకాశాలు: మోదీ

PM Modi: ప్రపంచం భారత్‌ వైపు చూస్తోంది.. యువతకు కొత్త అవకాశాలు: మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 19, 2026
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (Free Trade Agreements) దేశీయ యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశీయ నైపుణ్యాలపై ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు. వర్చువల్‌గా నిర్వహించిన రోజ్‌గార్‌ మేళాలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు 51 వేలకుపైగా నియామక పత్రాలను జారీ చేశారు. 'భారత్‌ ఇప్పటివరకు 40 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసింది. వీటి ద్వారా వ్యాపారులు, రైతులు, మహిళలు.. ఇలా ప్రతి ఒక్కరికీ కొత్త అవకాశాలు లభిస్తాయి.

వివరాలు

మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది

ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదిగింది' అని మోదీ తెలిపారు. దేశంలోని స్టార్టప్‌ల గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు.

గుర్తింపు పొందిన స్టార్టప్‌లలో దాదాపు సగం వరకు టైర్‌-2, టైర్‌-3 నగరాల నుంచే పుట్టుకొస్తున్నాయని అన్నారు.

దేశీయ లక్ష్యాల సాధనలో యువత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

యువతకు సమగ్ర అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

ADVERTISEMENT