NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SLBC Tunnel: 8 మంది సజీవంగా ఉండే అవకాశం లేనట్లే..! మార్క్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు వేగవంతం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    SLBC Tunnel: 8 మంది సజీవంగా ఉండే అవకాశం లేనట్లే..! మార్క్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు వేగవంతం
    8 మంది సజీవంగా ఉండే అవకాశం లేనట్లే..! మార్క్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు వేగవంతం

    SLBC Tunnel: 8 మంది సజీవంగా ఉండే అవకాశం లేనట్లే..! మార్క్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు వేగవంతం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 02, 2025
    09:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్(SLBC) వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రమాదం జరిగి ఎనిమిది రోజులు గడిచినా లోపల చిక్కుకుపోయిన వారిని బయటికి తీసుకురావడం అత్యంత సవాల్‌గా మారింది.

    ప్రస్తుతం జీపీఆర్‌ (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) మార్కింగ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయి.

    సజీవ అవకాశాలపై అనుమానాలు

    సొరంగం లోపల పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉన్నాయి. అక్కడి పరిస్థితుల దృష్ట్యా, లోపల చిక్కుకున్న ఎనిమిది మంది సజీవంగా ఉండే అవకాశం తక్కువగా ఉందని వాదనలు వినిపిస్తున్నాయి.

    సొరంగంలో పేరుకుపోయిన మట్టిని తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. లోపల ఊట ఉండటంతో, సహాయక చర్యలు ఆశించిన స్థాయిలో పురోగమించలేకపోతున్నాయి. చిన్న తప్పిదం జరిగినా, రెస్క్యూ బృందాలు కూడా ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంది.

    Details

    అవశేషాల వెలికితీత

    జీపీఆర్ ద్వారా కొన్ని అవశేషాలను గుర్తించడంతో, ఇవాళ వాటిని బయటకు తీసే అవకాశం ఉందని తెలుస్తోంది.

    అయితే అవశేషాలు ఒకేచోట కాకుండా విభిన్న ప్రదేశాల్లో ఉండటంతో, రెస్క్యూ ఆపరేషన్ పూర్తవ్వడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.

    ఫోరెన్సిక్ పరీక్షలకు సిద్ధం

    టన్నెల్ వద్ద ఫోరెన్సిక్, వైద్య బృందాలతో పాటు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. మృతదేహాలు వెలికితీసిన వెంటనే, వాటికి శవపరీక్ష నిర్వహించనున్నారు.

    ఆ తర్వాత అవి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. కానీ మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తించలేని పరిస్థితి ఉంటే, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించనున్నారు.

    Details

     ప్రమాదం ఎలా జరిగింది? 

    ఫిబ్రవరి 22వ తేదీన నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంట సమీపంలోని SLBC ఇన్‌లెట్ సొరంగంలో ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్ పైకప్పు కూలిపోయింది.

    అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ ఆపరేషన్‌లో దాదాపు 11 ప్రత్యేక విభాగాలు పాల్గొంటున్నాయి.

    సహాయక చర్యలు పూర్తవ్వడానికి ఇంకా సమయం పట్టొచ్చని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీశైలం
    తెలంగాణ

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    శ్రీశైలం

    నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు నాగార్జునసాగర్
    శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం ఆంధ్రప్రదేశ్
    Srisailam Dam:ఎగువ నుంచి వరద.. నాగార్జునసాగర్‌ 22 గేట్ల ద్వారా నీటి విడుదల   భారతదేశం
    Andrapradesh: జలాశయాల్లో పూడిక పెరుగుతోంది.. కేంద్ర జలసంఘం నివేదక రాష్ట్రం

    తెలంగాణ

    Uttam Kumar Reddy: జగన్‌తో స్నేహం కొనసాగిస్తూ తెలంగాణకు అన్యాయం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ ఏర్పాటు  భారతదేశం
    Hydra: నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం  భారతదేశం
    Taj Banjara: ఆస్తి పన్ను చెల్లించకపోతే తాళాలు.. తాజ్‌ బంజారా హోటల్‌కి జీహెచ్‌ఎంసీ షాక్‌ హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025