NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu: చివరి రోజు అదే కావొచ్చు.. సోషల్ మీడియా రౌడీలకు చంద్రబాబు వార్నింగ్!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu: చివరి రోజు అదే కావొచ్చు.. సోషల్ మీడియా రౌడీలకు చంద్రబాబు వార్నింగ్!
    చివరి రోజు అదే కావొచ్చు.. సోషల్ మీడియా రౌడీలకు చంద్రబాబు వార్నింగ్!

    CM Chandrababu: చివరి రోజు అదే కావొచ్చు.. సోషల్ మీడియా రౌడీలకు చంద్రబాబు వార్నింగ్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 11, 2025
    05:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్‌ మీడియా దుర్వినియోగం చేసే వారిపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

    ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాల ప్రతినిధులతో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా విమర్శిస్తే అది నేరంగా పరిగణిస్తామన్నారు.

    తప్పు చేసే వారిపై చండశాసనుడిగా వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు. వైఎస్‌ భారతిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

    ప్రస్తుతం సోషల్‌ మీడియా నేరస్థుల వేదికగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

    మహిళలకు గౌరవప్రదమైన జీవితం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

    Details

    బీసీ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి 

    బీసీ వర్గాల అభివృద్ధికి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. కులవృత్తులపై అవగాహన కల్పించేందుకు నక్కబోయిన కోటయ్య ఇంటిని సందర్శించిన సీఎం, ఆయన పశువుల పాకను పరిశీలించి, గేదెల ద్వారా ఆర్జించే ఆదాయంపై చర్చించారు.

    త్వరలో బీసీ సంరక్షణ చట్టాన్ని తీసుకువస్తామని, ఈ చట్టం మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో రూపుదిద్దుకుంటుందని తెలిపారు.

    బీసీలకు ఉద్యోగాల్లో 33 శాతం, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదేనని ఆయన గుర్తు చేశారు.

    జిల్లాల వారీగా బీసీ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. బీసీ విద్యార్థుల కోసం అమరావతిలో సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

    టీడీపీకి బీసీలు ఎప్పటి నుంచో వెన్నెముకగా ఉన్నారని పేర్కొన్నారు.

    Details

    పీ-4 ద్వారా అభివృద్ధి లక్ష్యం 

    మోదీ, పవన్ కల్యాణ్‌తో కలిసి వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నామని, లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వివరించారు.

    "తల్లికి వందనం" కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు.

    మే నుంచి రైతులకు విడతలవారీగా రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. పీ-4 (పంపిణీ, పునరుద్ధరణ, పునరావాసం, పరస్పర సహకారం) ప్రణాళికను ప్రారంభించామన్నారు.

    10 మంది సంపన్నులు 20 మంది పేదలకు చేయూత ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని వివరించారు.

    ఆగిరిపల్లిలో 206 పేద కుటుంబాలను గుర్తించామని, వారికి స్థలాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇచ్చిన తర్వాతే మళ్లీ ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ
    Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ

    చంద్రబాబు నాయుడు

    CM Chandrababu:ఏపీ బడ్జెట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష.. సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత   భారతదేశం
    AP Budget: 28న రాష్ట్ర బడ్జెట్‌.. సూపర్‌సిక్స్‌ హామీల అమలుకు ప్రత్యేక కేటాయింపులు భారతదేశం
    Chandrababu: ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌.. ప్రతి బస్సులో క్యూఆర్‌ కోడ్‌ భారతదేశం
    Free Gas Cylinder Scheme AP: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025