Page Loader
Adilabad: ఈ ఉపాధ్యాయుడి సంకల్పం.. ఏకంగా బడి తీరునే మార్చేసింది 
ఈ ఉపాధ్యాయుడి సంకల్పం.. ఏకంగా బడి తీరునే మార్చేసింది

Adilabad: ఈ ఉపాధ్యాయుడి సంకల్పం.. ఏకంగా బడి తీరునే మార్చేసింది 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2025
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒక ఉపాధ్యాయుని కృషితో ఒక గ్రామ పాఠశాల రూపమే మారిపోయింది. గత సంవత్సరం వరకు కేవలం 15 మంది విద్యార్థులతో నడుస్తున్న ఆ పాఠశాలలో ఇప్పుడు 152 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని తాండ్ర బాబాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు గత ఏడాది గరిష్ఠంగా 15 మంది విద్యార్థులే ఉండేవారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల లోపం కారణంగా స్థానికులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకే పంపించేవారు. అయితే,గత సంవత్సరం జూలైలో జాదవ్ రాజ్‌కుమార్ అనే ఉపాధ్యాయుడు బదిలీపై ఈ పాఠశాలలో చేరారు. విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఆయన ప్రత్యేక ప్రయత్నాలు ప్రారంభించారు.

వివరాలు 

ప్రస్తుత విద్యాసంవత్సరంలో 137 కొత్త ప్రవేశాలు 

తన స్వంత ఖర్చుతో రూ.1.50 లక్షలు ఖర్చు చేసి ఒక ప్రొజెక్టర్‌తో పాటు మూడు కంప్యూటర్లు కొనుగోలు చేశారు. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అదనపు తరగతులు నిర్వహించేందుకు కృషి చేశారు. బాలల ఆకర్షణ కోసం బడిబాట కార్యక్రమాన్ని కొనసాగిస్తూ సహోపాధ్యాయులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ విధంగా చేపట్టిన ప్రయత్నాలకు అద్భుతమైన ఫలితాలొచ్చాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 137 కొత్త ప్రవేశాలు పొందడం విశేషం.