Page Loader
OYO: ఈ ఏడాది ఓయో బుకింగ్స్‌లో 'హైదరాబాద్' అగ్రస్థానం.. తర్వాతి నగరమిదే?
ఈ ఏడాది ఓయో బుకింగ్స్‌లో 'హైదరాబాద్' అగ్రస్థానం.. తర్వాతి నగరమిదే?

OYO: ఈ ఏడాది ఓయో బుకింగ్స్‌లో 'హైదరాబాద్' అగ్రస్థానం.. తర్వాతి నగరమిదే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2024
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

2024 సంవత్సరం ముగియేందుకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈ ఏడాది ఆఖరులో ఓయో తన నివేదికను విడుదల చేసింది. ట్రావెలోపీడియా 2024 నివేదిక ప్రకారం భారతదేశంలో మతపరమైన పర్యాటకానికి ఈ సంవత్సరం ప్రత్యేక ప్రాధాన్యత దక్కింది. పూరీ, వారణాసి, హరిద్వార్‌ వంటి ప్రముఖ ఆధ్యాత్మిక గమ్యస్థానాలు ఈ సంవత్సరం చర్చనీయాంశంగా నిలిచాయి. అలాగే దేవఘర్, పళని, గోవర్ధన్‌లలో కూడా గణనీయమైన వృద్ధి నమోదైంది. బుకింగ్స్‌లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది, తర్వాత బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా వంటి నగరాలు అగ్రస్థానాల్లో ఉన్నాయి.

Details

ముంబైలో బుకింగ్స్ తగ్గుముఖం

ఉత్తరప్రదేశ్‌ ప్రయాణానికి అత్యధికంగా ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా నిలిచింది. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలు పర్యాటకులకు అనుకూలంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. పాట్నా, రాజమండ్రి, హుబ్లీ వంటి చిన్న నగరాల్లో బుకింగ్స్ 48 శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది సెలవుల సమయంలో ప్రయాణ కార్యకలాపాలు పెరిగినట్లు ఓయో తెలిపింది. గోవా, పుదుచ్చేరి, మైసూర్ వంటి ఎవర్‌గ్రీన్ గమ్యస్థానాలతో పాటు జైపూర్ పర్యాటక కేంద్రంగా కొనసాగుతోంది. అయితే, ముంబైలో బుకింగ్స్ తగ్గుముఖం పట్టాయి. ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీసెస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్‌బోలే ఈ ఏడాది పర్యాటక రంగంలో అభివృద్ధి సాధించామని తెలిపారు.

Details

ఓయో సీఈఓగా రితేశ్ అగర్వాల్

పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత కోసం చాలా మంది తమ ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లినట్లు కూడా చెప్పారు. 2012లో స్థాపించిన ఓయో, భారత స్టార్టప్ కంపెనీలలో ఒక సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఏ చిన్న పట్టణంలోనైనా ఓయో రూమ్స్ అందుబాటులో ఉంటాయి. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు రాత్రి బస చేయాల్సినప్పుడు ఓయోనే గుర్తుకు వస్తుంది. ఈ సంస్థ అభివృద్ధి వెనుక ఓ యువకుడి కృషి, పట్టుదల ఉంది. ఆ యువకుడు రితేశ్‌ అగర్వాల్, ప్రస్తుతం ఓయో సీఈఓగా కొనసాగుతున్నారు.