Bangladeshi immigrants: బెంగాల్లో అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్యలు.. బోర్డర్ వద్ద టెన్షన్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో హకింపూర్ సరిహద్దు ప్రాంతంలో భారీగా ప్రజలు గుమిగూడారు. వీరిలో ఎక్కువ మంది అక్రమంగా భారత్లో నివసిస్తున్న బంగ్లాదేశ్ వలసదారులేనని అనుమానిస్తున్నారు. వీరంతా తిరిగి బంగ్లాదేశ్ వెళ్లేందుకు సరిహద్దు వద్ద వేచి ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అక్రమ చొరబాట్లపై "డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్" విధానాన్ని కఠినంగా అమలు చేసిన తర్వాత ఈ పరిస్థితి నెలకొంది.
వివరాలు
ఎస్ఐఆర్ సమయంలో కనిపించిన దృశ్యాలే..
న్యూస్18 కథనం ప్రకారం.. మంగళవారం హకింపూర్ సరిహద్దులో కనిపించిన పరిస్థితులు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ సమయంలో కనిపించిన దృశ్యాలను తలపించాయి. ఐఏఎన్ఎస్తో మాట్లాడిన ఓ బంగ్లాదేశ్ వ్యక్తి.. "గత ఒకటి, రెండు సంవత్సరాలుగా డమ్డమ్ ప్రాంతంలో ఉంటున్నాను. ప్రభుత్వం ఇక్కడ ఉండనివ్వకపోతే మేం ఏం చేయగలం?" అని చెప్పినట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అనుమానిత చొరబాటుదారుడి ఇంటర్వ్యూ
North 24 Parganas, West Bengal: A Bangladeshi infiltrator says, "I have been living here in Dum Dum for the past one or two years. If the administration does not keep us here, then what can we do? Tell me. If the government does not support us, we cannot stay here, so what else… pic.twitter.com/oSXhErC326
— IANS (@ians_india) May 26, 2026
వివరాలు
అక్రమ విదేశీయుల కోసం హోల్డింగ్ సెంటర్లు
అనుమానిత అక్రమ విదేశీయులను ఉంచేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక హోల్డింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. మాల్దా జిల్లాలోని ఇంగ్లీష్ బజార్ ప్రాంతంలోని చందన్ పార్క్లో తొలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ ముగ్గురు మహిళలు, ఆరుగురు చిన్నారులు సహా మొత్తం తొమ్మిది మంది అనుమానిత బంగ్లాదేశ్ పౌరులను ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ కేంద్రంలో సీసీటీవీ నిఘా, పోలీస్ భద్రతతో పాటు ఆహారం, ఇతర అవసరాల ఏర్పాట్లు కూడా ఉన్నాయి.
వివరాలు
'డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్' విధానం
అక్రమ వలసదారులు, ముఖ్యంగా బంగ్లాదేశ్, రోహింగ్యాలపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం "డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్" విధానాన్ని అమలు చేస్తోంది. ఇటీవల సీఎం సువేందు అధికారి మాట్లాడుతూ.. పోలీసులకు చిక్కిన చొరబాటుదారులను నేరుగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)కు అప్పగిస్తామని తెలిపారు. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.
వివరాలు
ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025 ముఖ్యాంశాలు
ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025 ప్రకారం హెడ్ కానిస్టేబుల్ స్థాయి లేదా అంతకంటే పైస్థాయి పోలీసు అధికారులు వారెంట్ లేకుండానే అనుమానితులను అరెస్ట్ చేసే అధికారాన్ని పొందారు. 2025 మే 2న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విదేశీయుల విభాగం రోహింగ్యాలు, బంగ్లాదేశ్ చొరబాటుదారులపై ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. పౌరసత్వ పత్రాల పరిశీలన పూర్తయ్యే వరకు అనుమానితులను 30 రోజుల పాటు అదుపులో ఉంచే అవకాశం ఈ నిబంధనల్లో ఉంది.
వివరాలు
రాజకీయ నేతల భిన్నాభిప్రాయాలు
ఈ చర్యపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర మాల్దా బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. పౌరసత్వ సవరణ చట్టం (CAA) పరిధిలో లేని వారు తమ దేశాలకు తిరిగి వెళ్లాలని అన్నారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత కృష్ణేందు నారాయణ్ చౌదరి మాట్లాడుతూ.. అక్రమ వలసదారులపై చర్యలు ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా మాత్రమే తీసుకోవాలని, భారత పౌరులు ఎవరూ ఇబ్బందులు ఎదుర్కోకూడదని పేర్కొన్నారు.