NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cyber Attack: పాక్‌ హ్యాకర్ల ముప్పు.. భారత్‌లో సైబర్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Cyber Attack: పాక్‌ హ్యాకర్ల ముప్పు.. భారత్‌లో సైబర్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం
    పాక్‌ హ్యాకర్ల ముప్పు.. భారత్‌లో సైబర్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం

    Cyber Attack: పాక్‌ హ్యాకర్ల ముప్పు.. భారత్‌లో సైబర్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 26, 2025
    12:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి.

    ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాలు దౌత్య పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుండగా, పాక్ హ్యాకర్ల నుంచి సైబర్ ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.

    దీంతో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. పాకిస్థాన్ ఆధారిత హ్యాకర్లు పహల్గాం ఘటన తర్వాత భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారని సమాచారం.

    ముఖ్యంగా ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెబ్‌సైట్‌పై హ్యాకింగ్ దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.

    ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సైబర్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు ప్రారంభించింది.

    Details

    సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను కట్టుదిట్టం చేసుకోవాలి

    అన్ని మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను కట్టుదిట్టం చేసుకోవాలని సూచిస్తూ అలర్ట్ జారీ చేసింది.

    అనధికార యాక్సెస్, డేటా లీకులను అడ్డుకునేందుకు సైబర్ హైజీన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SoPs) పాటించాలని, మరింత బలమైన భద్రతా చర్యలు అమలు చేయాలని ఆదేశించింది.

    గతంలోనూ పాక్ హ్యాకర్లు జీ20 సమావేశాలకు సంబంధించి వెబ్‌సైట్లను టార్గెట్ చేసిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ, తాజాగా పహల్గాం దాడి జరిగిన కొద్దిసేపటికే సైబర్ దాడికి పాల్పడ్డారని నిఘా వర్గాలు వెల్లడించాయి.

    ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఆధ్వర్యంలో ఈ దాడులపై ఒక అంతర్గత నివేదిక సిద్ధమవుతోంది.

    Details

    మౌలిక సదుపాయాల వ్యవస్థలను అస్థిరపరిచే కుట్ర

    ప్రస్తుతం ఈ హ్యాకింగ్‌ను కేవలం సైబర్ నేరంగా కాకుండా దేశ భద్రతను కుదిపేయాలనే యుద్ధ వ్యూహంగా భారత అధికారులు భావిస్తున్నారు.

    శుక్రవారం హ్యాకర్ల దాడిలో ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెబ్‌సైట్‌పై రెచ్చగొట్టే సందేశాలు, పహల్గాం ఘటనకు సంబంధించిన చిత్రాలు, ఉగ్రవాదుల ఫొటోలతో కూడిన అసభ్య మెసేజులు కనిపించాయని అధికారులు తెలిపారు.

    ఈ దాడుల వెనుక మౌలిక సదుపాయాల వ్యవస్థలను అస్థిరపరిచే కుట్ర ఉన్నదని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

    ప్రస్తుతం సైబర్ నెట్‌వర్క్‌ను గుర్తించి దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇది కేవలం సైబర్ ముప్పే కాకుండా భారత్‌పై పాక్ పన్నిన వ్యూహాత్మక దాడిగా భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    పాకిస్థాన్

    తాజా

    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    భారతదేశం

    BRICS Conference: బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.. భారత్-చైనా సరిహద్దు వివాదంపై కీలక చర్చలు బ్రెజిల్
    Ashwini Vaishnav: తొలి స్వదేశీ చిప్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. ఈ ఏడాదిలోనే విడుదల : అశ్వినీ వైష్ణవ్ అశ్విని వైష్ణవ్
    voter turnout: భారత్‌కు 21 కోట్ల డాలర్ల ఎన్నికల నిధుల నిలుపుదలపై అమెరికా ప్రకటన  అమెరికా
    Rajesh Agarwal: ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై త్వరలో భారత్-అమెరికా చర్చలు  అమెరికా

    పాకిస్థాన్

    Pakistan: పాకిస్థాన్‌లో మరో ఉగ్రదాడి.. 12 మంది మృతి ప్రపంచం
    Pakistan Gold Discovery: పాకిస్థాన్ పసిడిమయం.. సింధు నదిలో భారీగా బంగారం నిక్షేపాలు..   అంతర్జాతీయం
    Pakistani Envoy: పాకిస్థాన్ రాయబారిని వెనక్కి పంపిన అమెరికా అమెరికా
    Baloch Militants Hijack Train: పాకిస్తాన్‌లో రైలును హైజాక్.. 120 మందికి పైగా  బందీలు.. 6 మంది సైనికులు మృతి అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025