NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / High Court: ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం
    తదుపరి వార్తా కథనం
    High Court: ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం
    ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం

    High Court: ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 29, 2024
    11:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్ ప్రమాణ స్వీకారం చేశారు. సో

    మవారం హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ నూతన న్యాయమూర్తులతో ప్రమాణం చేయించారు.

    ఈ నియామకంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరుకుంది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు కొత్తగా నియమితులైన న్యాయమూర్తుల నియామక ఉత్తర్వులను చదివి వినిపించారు.

    న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార వేడుకకు హైకోర్టు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రభుత్వం తరఫు అధికారులు, నూతన న్యాయమూర్తుల కుటుంబసభ్యులు హాజరయ్యారు.

    Details

     జస్టిస్ కుంచం మహేశ్వరరావు 

    తిరుపతికి చెందిన జస్టిస్ మహేశ్వరరావు 1998లో న్యాయవాదిగా ప్రవేశించారు.

    సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ వద్ద శిక్షణ పొందిన అనంతరం సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధ కేసులలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారు.

    జస్టిస్ తూట చంద్ర ధనశేఖర్

    నెల్లూరులో న్యాయ విద్యాభ్యాసం చేసిన ధనశేఖర్ 1999లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు.

    ప్రభుత్వ న్యాయవాదిగా పని చేసి, ట్యాక్స్, రెవెన్యూ, భూసేకరణ వంటి పలు అంశాల్లో విశేష అనుభవం సాధించారు.

    జస్టిస్ చల్లా గుణరంజన్

    అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన గుణరంజన్ సుప్రీంకోర్టు, హైకోర్టు, వివిధ ట్రైబ్యునల్‌లలో ప్రాక్టీసు చేస్తున్నారు.

    విద్యుత్, పర్యావరణ, పన్ను చట్టాలపై అనుభవం కలిగి పలు సంస్థలకు న్యాయ సలహాదారుగా సేవలందిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైకోర్టు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    హైకోర్టు

    AP Highcourt : ఎస్‌ఐ నియామకాలపై హైకోర్టు విచారణ.. అభ్యర్థుల ఎత్తును మరోసారి కొలవాలని కోర్టు ఆదేశం' ఆంధ్రప్రదేశ్
    High Court: చంద్రబాబు, కొల్లు రవీంద్రపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం  చంద్రబాబు నాయుడు
    BharatPe: 'భారత్ పే'కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు.. అష్నీర్ గ్రోవర్‌కు జరిమానా  దిల్లీ
    Kodi Kathi Case: కోడి కత్తి కేసులో కుట్రకోణం లేదు: హైకోర్టులో ఎన్ఐఏ  ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    AP Liquor Policy: నేటి నుంచి ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు.. ప్రారంభం కానున్న 3396 కొత్త షాపులు.. భారతదేశం
    AP High Court: ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు.. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు భారతదేశం
    Andhrapradesh: నేడు ఏపీ మంత్రివర్గ భేటీ .. వాలంటీర్లు,అమ్మకు వందనం,ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక నిర్ణయం భారతదేశం
    Heavy Rains: వాయుగుండం ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్  బంగాళాఖాతం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025