NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Iran: ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు క్షేమం.. రాయబార కార్యాలయం వెల్లడి 
    తదుపరి వార్తా కథనం
    Iran: ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు క్షేమం.. రాయబార కార్యాలయం వెల్లడి 
    ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు క్షేమం.. రాయబార కార్యాలయం వెల్లడి

    Iran: ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు క్షేమం.. రాయబార కార్యాలయం వెల్లడి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 04, 2025
    09:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇరాన్‌లో ఇటీవల అదృశ్యమైన ముగ్గురు భారతీయులు సురక్షితంగా ఉన్నారని, టెహ్రాన్ పోలీసులు వారిని రక్షించారని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

    ఈ సమాచారం తెలియడంతో బాధితుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

    ఈ ముగ్గురిలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన హుషన్‌ప్రీత్ సింగ్ (సంగ్రూర్), జస్పాల్ సింగ్ (ఎస్‌బీఎస్ నగర్), అమృతపాల్ సింగ్ (హోషియార్‌పూర్) ఉన్నారు.

    వీళ్లు మే 1న హోషియార్‌పూర్‌లోని ఓ ఏజెంట్ సాయంతో ఇరాన్‌కు వెళ్లారు.

    కానీ అక్కడికి వెళ్లిన వెంటనే దుండగులు వారిని అపహరించి తాళ్లతో కట్టి, వారి కుటుంబ సభ్యులకు ఫొటోలు పంపిస్తూ రూ. కోటి డిమాండ్ చేశారు.

    ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు.

    వివరాలు 

    ఇరాన్‌కు పంపించిన ఏజెంట్ కూడా మిస్ 

    ఇక మే 11 నుంచి అయితే ఎలాంటి సమాచారం లేదు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు.

    వెంటనే ఎంబసీ అధికారులు స్పందించి,ఇరాన్ అధికారులకు వివరాలు అందజేశారు.

    అదృష్టవశాత్తూ ఇరాన్ పోలీసులు చర్యలు తీసుకొని వారిని రక్షించారు.

    ఇదే సమయంలో హోషియార్‌పూర్‌కు చెందిన వారిని ఇరాన్‌కు పంపించిన ఏజెంట్ కూడా మిస్సయ్యాడు, ఇది కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళనకు దారి తీసింది.

    ఇకపోతే,ముగ్గురు యువకులు సురక్షితంగా ఉన్నారన్న సమాచారం రావడంతో వారి కుటుంబ సభ్యులందరూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

    టెహ్రాన్ పోలీసులు ఓ రహస్య రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వీరిని కాపాడినట్టు సమాచారం.

    అయితే,వారిని ఎవరు కిడ్నాప్ చేశారు?ఎందుకు కిడ్నాప్ చేశారు?అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రాలేదు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    భారత్ లోని ఇరాన్ ఎంబసీ చేసిన ట్వీట్ 

    Three missing Indian citizens freed by Tehran police
    Local media in Iran say police have found and released three Indian men who had gone missing in Iran.https://t.co/YAkirkKRHg

    — Iran in India (@Iran_in_India) June 3, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇరాన్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    ఇరాన్

    Netanyahu: ఇరాన్ చమురు, అణు స్థావరాలపై దాడి చేయబోం :అమెరికాకి ఇజ్రాయెల్ హామీ..!    బెంజమిన్ నెతన్యాహు
    Iran: ఇరాన్ ప్రభుత్వ టీవీలో కనిపించిన ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖానీ ఇజ్రాయెల్
    Israel-Hamas:యాహ్యా సిన్వర్‌ మృతి.. ఇజ్రాయెల్‌తో యుద్ధం మరింత తీవ్రతరం.. తీవ్రంగా స్పందించిన హెజ్‌బొల్లా  హిజ్బుల్లా
    Israel-Iran: ఇరాన్‌పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు.. లీకైన అమెరికా ఇంటెలిజెన్స్ పత్రాలు!   ఇజ్రాయెల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025