NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pre Launch Offer Real Estate Scam: ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో 350 మంది నుంచి రూ.80 కోట్లకు పైగా వసూళ్లు
    తదుపరి వార్తా కథనం
    Pre Launch Offer Real Estate Scam: ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో 350 మంది నుంచి రూ.80 కోట్లకు పైగా వసూళ్లు
    ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో 350 మంది నుంచి రూ.80 కోట్లకు పైగా వసూళ్లు

    Pre Launch Offer Real Estate Scam: ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో 350 మంది నుంచి రూ.80 కోట్లకు పైగా వసూళ్లు

    వ్రాసిన వారు Stalin
    May 18, 2024
    04:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో హైదరాబాద్‌లో మోసాలు యదేచ్ఛగా జరుగుతున్నాయి.

    సాహితీ ఇన్ ఫ్రా, ఎలన్ వంటి తదితర కంపెనీలు ప్రీ-లాంచ్ పేరుతో మోసాలు వెలుగులోకి వచ్చినా అమాయకపు ప్రజలు ఇంకా వంచనకు గురి అవుతున్నారు.

    వీటిపై న్యాయస్ధానం జోక్యం చేసుకుని కొందరు బాధితులకు ఊరట కలిగించిన సంగతి తెలిసిందే. ఇలాంటి మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది.

    Details 

    మరో ప్రీ-లాంచ్ ఆఫర్ మోసం 

    ఈ సారి భారతీ లేక్‌వ్యూ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు.

    ఈ వ్యవహారంలో భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు, ఎండీ శివరామకృష్ణ, సీఈఓ నరసింహరావులను అరెస్టులు అరెస్టు చేశారు.

    కొంపల్లిలో భారతీ లేక్‌వ్యూ ప్రీ-లాంచ్ పేరుతో భారీగా వసూళ్లు చేసినట్లు గుర్తించారు. అతి తక్కువ ధరకు ఫ్లాట్స్ అంటూ 350 మంది నుంచి రూ.80 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు గుర్తించారు.

    డబ్బులు వసూలు చేసినా నిర్మాణం చేపట్టలేదు. దీంతో బాధితులు పోలీసులు ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

    వివరాల్లోకి వెళితే.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని భారతి లేక్ వ్యూ పేరుతో ఓ ప్రాజెక్టును చేపట్టారు. ప్రీ-లాంచ్ ఆఫర్ అంటూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశారు.

    Details 

    చదరపు అడుగు రూ. 3,200కే..

    6.23 ఎకరాల్లో తమ సంస్థ నిర్మాణం చేపడుతుందని చెప్పారు.చదరపు అడుగు రూ. 3,200కే అంటూ ఆకర్షణీయమైన ధరతో ఫ్లాట్‌లను ప్రచారం చేశారు.

    రంగురంగుల బ్రోచర్‌లను పంపిణీ చేశారు. కొంపల్లిలోని వెంచర్ సైట్‌తో పాటు మాదాపూర్‌లోని ఆఫీసుల్లో కస్టమర్లతో సమావేశాలు నిర్వహించి వారిని నమ్మించారు.

    రంగురంగుల బ్రోచర్‌లను చూసి మోసపోయినంత కాలం ఇలాంటి కేటుగాళ్ల నుంచి ఏ రేరా చట్టం ప్రజలను కాపాడలేదు. అప్రమత్తంగా ఉండటమే దీనికి పరిష్కారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Gulzar House : యజమాని నిర్లక్ష్యమే కారణమా..? గుల్జార్ హౌస్ ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి! హైదరాబాద్
    Jyoti Malhotra: ఉగ్రదాడికి ముందు పహల్గాంలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి.. ఆపరేషన్‌ సిందూర్‌
    Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్ టాలీవుడ్
    Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు హర్యానా

    హైదరాబాద్

    LB Nagar accident: ఎల్‌బీ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ మృతి.. ఎస్‌ఐకి గాయాలు  ఎల్బీనగర్
    Robbery in Hyderabad: హైదరాబాద్‌ నగల దుకాణంలో దోపిడి.. ముగ్గురు అరెస్ట్  భారతదేశం
    Autos Strike Today: ఆటో డ్రైవర్ల సమ్మె.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు  తెలంగాణ
    Rashmika Mandanna: చావు నుంచి తప్పించుకున్న రష్మిక  రష్మిక మందన్న
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025