NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manipur: మణిపూర్ లో మరోసారి హింస..ముగ్గురు మృతి..30మందికి పైగా గాయాలు 
    తదుపరి వార్తా కథనం
    Manipur: మణిపూర్ లో మరోసారి హింస..ముగ్గురు మృతి..30మందికి పైగా గాయాలు 
    మణిపూర్ లో మరోసారి హింస..ముగ్గురు మృతి..30మందికి పైగా గాయాలు

    Manipur: మణిపూర్ లో మరోసారి హింస..ముగ్గురు మృతి..30మందికి పైగా గాయాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 16, 2024
    10:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది.కూకీ వర్గానికి చెందిన పోలీసు హెడ్ కానిస్టేబుల్‌ శ్యాం లాల్ సస్పెండ్ ను వ్యతిరేకిస్తూ..మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ ఎస్పీ ఆఫీసును ప్రజలు ముట్టడించారు.

    దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే క్రమంలో ముగ్గురు మృతి చెందగా,30మందికి పైగా గాయపడ్డారు. అయితే.. శ్యాం లాల్..సాయుధ వ్యక్తులతో ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో అతడిని ఉద్యోగం నుండి తొలగించారు.

    "సుమారు 300-400 మందితో కూడిన గుంపు ఈరోజు SP CCP కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించి, రాళ్లురువ్వారని " మణిపూర్ పోలీసులు X లో తెలిపారు.

    "RAFతో సహా SF (భద్రతా దళాలు) పరిస్థితిని నియంత్రించడానికి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడం ద్వారా తగిన విధంగా ప్రతిస్పందిస్తోంది. విషయాలు పరిశీలనలో ఉన్నాయి" అని పోలీసులు తెలిపారు.

    Internet 

    ఇంటర్నెట్ సేవలపై ఐదు రోజుల నిషేధం 

    మణిపూర్ ప్రభుత్వం మరోసారి ఇంటర్నెట్ సేవలపై ఐదు రోజుల నిషేధాన్ని అమలు చేసింది.

    జాయింట్ సెక్రటరీ (హోమ్) జారీ చేసిన నోటీసు ప్రకారం,శాంతిభద్రతల పరిస్థితుల దృష్ట్యా,సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఎటువంటి తప్పుడు సమాచారం లేదా ఇతర రకాల హింసాత్మక కార్యకలాపాల వ్యాప్తి, చెయ్యకూడదని పేర్కొంది.

    చురచంద్‌పూర్ జిల్లాలో శాంతిభద్రతల అస్థిర పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం చురచంద్‌పూర్ జిల్లా మొత్తం రెవెన్యూ పరిధిలో ఐదు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్/డేటా సేవలు, ఇంటర్నెట్/డేటా సేవలను VPN ద్వారా తాత్కాలికంగా నిలిపివేయాలని/అరికట్టాలని నిర్ణయించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మణిపూర్ పోలీసులు చేసిన ట్వీట్ 

    Mob numbering approx. 300–400 attempted to storm the office of SP CCP today, pelting stones, etc. The SF, including the RAF, is responding appropriately by firing tear gas shells to control the situation. Things are under watch..

    — Manipur Police (@manipur_police) February 15, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    మణిపూర్

    మణిపూర్‌లో ఆగని హింసకాండ.. ఖోయిరెంటాక్‌లో ప్రతీకార కాల్పుల్లో వ్యక్తి మృతి భారతదేశం
    మణిపూర్‌లో భీకర కాల్పులు.. 8 మంది మృతి, భారీగా పేలుడు పదర్థాలు స్వాధీనం భారతదేశం
    'ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' సభ్యులపై మణిపూర్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ తాజా వార్తలు
    మణిపూర్‌: కర్ఫ్యూను దిక్కరించి వీధుల్లోకి వచ్చిన నిరసనకారులు.. రబ్బరు బుల్లెట్లతో కాల్పులు తుపాకీ కాల్పులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025