Page Loader
UPSC CSE 2025 Results: సివిల్స్‌ 2024 ఫలితాల్లో టాప్‌ 5లో ముగ్గురు మహిళలు.. వారి గురించి తెలుసా?
సివిల్స్‌ 2024 ఫలితాల్లో టాప్‌ 5లో ముగ్గురు మహిళలు.. వారి గురించి తెలుసా?

UPSC CSE 2025 Results: సివిల్స్‌ 2024 ఫలితాల్లో టాప్‌ 5లో ముగ్గురు మహిళలు.. వారి గురించి తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 22, 2025
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూపీఎస్సీ సివిల్స్‌ 2024 ఫైనల్‌ ఫలితాల్లో మహిళలు తమ ప్రతిభతో సత్తా చాటారు. ఈసారి టాప్‌ 5 ర్యాంకుల్లో ముగ్గురు మహిళలు చోటు దక్కించుకోవడం విశేషం. శక్తి దూబే ఫస్ట్‌ ర్యాంకుతో టాపర్‌గా నిలవగా, హర్షిత గోయల్‌ రెండో ర్యాంకు, షా మార్గి చిరాగ్‌ నాలుగో ర్యాంకుతో అదరగొట్టారు. టాప్‌ 25 ర్యాంకుల్లో 11 మంది మహిళలుండటమే దీనికి నిదర్శనం.

Details

టాప్‌ ర్యాంకర్ల విద్యార్హతలు, ఆప్షనల్‌ సబ్జెక్టులివే

శక్తి దూబే అలహాబాద్‌ యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్‌ చేశారు. తరువాత బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో పీజీ. సివిల్స్‌ మెయిన్స్‌లో పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ను ఆప్షనల్‌గా తీసుకొని ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించారు. యూపీకి చెందిన ఆమె 2018 నుంచే సివిల్స్‌ కోసం సిద్ధమవుతున్నారు. హర్షిత గోయల్ బరోడాలోని ఎంఎస్‌ యూనివర్సిటీ నుంచి బీకామ్‌ చేసిన హర్షిత, అదే ఆప్షనల్‌తో రెండో ర్యాంక్‌ సాధించారు. డోంగ్రే అర్చిత్‌ పరాగ్ వెల్లూరులోని విట్‌ నుంచి ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఫిలాసఫీ ఆప్షనల్‌తో మూడో ర్యాంక్‌ దక్కించుకున్నారు.

Details

 షా మార్గి చిరాగ్ 

గుజరాత్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో బీఈ (కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌) పూర్తి చేసిన ఆమె, సోషియాలజీ ఆప్షనల్‌తో నాలుగో ర్యాంక్‌ సాధించారు. ఆకాశ్‌ గార్గ్ దిల్లీ గురు గోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ నుంచి బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) పూర్తి చేశారు. సోషియాలజీ ఆప్షనల్‌తో ఐదో ర్యాంక్‌ అందుకున్నారు. ఎంతమంది ఎంపికయ్యారు? 2023 జూన్‌ 16న జరిగిన ప్రిలిమ్స్‌కు 9,92,599మంది దరఖాస్తు చేసుకోగా, 5,83,213 మంది పరీక్ష రాశారు. వీరిలో సెప్టెంబర్‌లో జరిగిన మెయిన్స్‌ రాత పరీక్షకు 14,627 మంది అర్హత సాధించారు. పర్సనాలిటీ టెస్ట్‌కు 2,845 మంది ఎంపికవ్వగా, తాజా ఫలితాల్లో 1,009 మంది అభ్యర్థులను (725 పురుషులు, 284 మహిళలు) యూపీఎస్సీ వివిధ సర్వీసుల్లో నియమించేందుకు సిఫారసు చేసింది.

Details

టాప్‌ 25లో వైవిధ్యభరిత విద్యార్హతలు, ఆప్షనల్‌లు 

టాప్‌ 25 ర్యాంకర్లలో 14 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉండగా, వీరంతా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, వీఐటీ, జేఎన్‌యూ, దిల్లీ యూనివర్సిటీ, అలహాబాద్‌ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. వారి విద్యార్హతలు ఇంజినీరింగ్‌, హ్యూమానిటీస్‌, సైన్స్‌, కామర్స్‌, మెడికల్‌, ఆర్కిటెక్చర్‌ విభాగాలకే పరిమితం కాకుండా విస్తృతంగా ఉన్నాయి. ఆప్షనల్‌గా ఎంచుకున్న సబ్జెక్టుల్లో ఆంత్రోపాలజీ, కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ, జాగ్రఫీ, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తమిళ భాషా సాహిత్యం వంటి పలు విభాగాలు ఉన్నాయి.