NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India-France-UAE: 'భారత్-ఫ్రాన్స్- యూఏఈ' త్రైపాక్షిక ప్రణాళిక సహకారం దిశగా మోదీ; ఈనెల 15న అబుదాబికి ప్రధాని
    తదుపరి వార్తా కథనం
    India-France-UAE: 'భారత్-ఫ్రాన్స్- యూఏఈ' త్రైపాక్షిక ప్రణాళిక సహకారం దిశగా మోదీ; ఈనెల 15న అబుదాబికి ప్రధాని
    'భారత్-ఫ్రాన్స్- యూఏఈ' త్రైపాక్షిక ప్రణాళిక సహకారం దిశగా మోదీ; ఈనెల 15న అబుదాబికి ప్రధాని

    India-France-UAE: 'భారత్-ఫ్రాన్స్- యూఏఈ' త్రైపాక్షిక ప్రణాళిక సహకారం దిశగా మోదీ; ఈనెల 15న అబుదాబికి ప్రధాని

    వ్రాసిన వారు Stalin
    Jul 12, 2023
    12:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్-ఫ్రాన్స్-యూఏఈ త్రైపాక్షిక ఫ్రేమ్‌వర్క్ కింద రక్షణ, అణుశక్తి, సాంకేతిక రంగాలలో సహకారం కోసం ప్రతిష్టాత్మక రోడ్‌మ్యాప్‌ను ఫ్రిబవరిలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

    అయితే ఈ ప్రణాళికకు పూర్తిస్థాయిలో రూపాన్ని ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరో ముందడుగు వేయబోతున్నారు.

    జులై 15వ తేదీన ప్రధాని మోదీ యూఏఈలోని అబుదాబిలో పర్యటించనున్నారు.

    ఈ నెల 13,14తేదీల్లో ఫ్రాన్స్‌లో తన పర్యటనను పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో మోదీ అబుదాబికి చేరుకుంటారు.

    జులై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా నిర్వహించే బాస్టిల్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విశిష్ట అతిథిగా ఆహ్వానించారు.

    ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరగనున్నాయి.

    మోదీ

    ఐదోసారి ప్రధాని మోదీ యూఏఈలో పర్యటన

    యూఏఈతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేయడానికి ప్రధాని మోదీ అబుదాబిలో అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలవనున్నారు.

    ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబి పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుస్తుదనంలో సందేహం లేదు.

    2014లో అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ యూఏఈలో ఇప్పటి వరకు నాలుగు సార్లు పర్యటించారు. తాజా పర్యటన 5వది అవుతుంది.

    ఈ పరిణామం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇదిలా ఉంటే, సౌదీ నేత, ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్-ఇస్సాతో ప్రధాని మోదీ మంగళవారం సమావేశమయ్యారు. ఇస్లామిక్ దేశాల్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు.

    మోదీ

    జూన్‌లో మూడు దేశాల ఆధ్వర్యంలో నావికా విన్యాసాలు

    భారతదేశం-ఫ్రాన్స్-యూఏఈ మూడు దేశాల మధ్య బలమైన రక్షణ సహకార బంధంలో భాగంగా అబుదాబిలో త్రైపాక్షిక సహకార ప్రణాళికను సంయుక్తంగా ప్రకటించాయి.

    త్రైపాక్షిక సహకార ప్రణాళిక భాగంగా మూడు దేశాలు జూన్ 7, 2023న గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో మొట్టమొదటి త్రైపాక్షిక నావికా విన్యాసాన్ని నిర్వహించాయి.

    ఇందులో ఐఎన్ఎస్ తర్కాష్, హెలికాప్టర్లతో ఫ్రెంచ్ నౌక సర్కూఫ్, రాఫెల్ ఫైటర్స్, యూఏఈ నేవీ సముద్ర గస్తీ విమానాలు పాల్గొన్నాయి.

    వాణిజ్యం, సముద్ర భద్రతతో పాటు నావిగేషన్ స్వేచ్ఛ వంటి ప్రాథమిక లక్ష్యాల కోసం త్రైపాక్షిక ప్రణాళికను ప్రకటించారు.

    అయితే యూఏఈ పర్యటన గురించి ప్రధానమంత్రి కార్యాలయం ఇంతవరకు స్పందించలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఫ్రాన్స్
    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్/యూఏఈ
    తాజా వార్తలు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    నరేంద్ర మోదీ

    భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం; 2024‌లో ఐఎస్ఎస్‌కి జాయింట్ ఆస్ట్రోనాట్ మిషన్‌  ఇస్రో
    అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం హైలెట్స్ ఇవే ప్రధాన మంత్రి
    డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం  వాణిజ్యం
    నేడు బోయింగ్, అమెజాన్, గూగుల్ సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశం ప్రధాన మంత్రి

    ఫ్రాన్స్

    సిస్టర్ ఆండ్రీ : ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత అంతర్జాతీయం
    కార్బన్-ఫైబర్ ప్యానెల్స్‌తో రెస్టో-మోడెడ్ 1602 ను ప్రదర్శించిన BMW కార్
    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    8 మందిపై క‌త్తితో విరుచుకుపడ్డ సైకో.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం ప్రపంచం

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్/యూఏఈ

    ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్; రూ.122.6 కోట్లకు అమ్మకం; గిన్నిస్ రికార్డు దుబాయ్

    తాజా వార్తలు

    లాస్ ఏంజిల్స్: ప్రైవేట్ జెట్ క్రాష్, ఆరుగురు మృతి అమెరికా
    స్మార్ట్‌ఫోన్ కొంటే, 2కిలోల టమాటాలు ఉచితం; ఆ మొబైల్ షాప్ ఎక్కడ ఉందంటే! స్మార్ట్ ఫోన్
    ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న వానలు; హిమాచల్‌లో ఐదుగురు మృతి; దిల్లీలో 41ఏళ్ల రికార్డు బద్దలు  దిల్లీ
    రిలయన్స్‌ వ్యాపారంలో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కొత్త రోల్  ముకేష్ అంబానీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025