NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నేడు దిల్లీ యూనివర్శిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన
    తదుపరి వార్తా కథనం
    నేడు దిల్లీ యూనివర్శిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన
    నేడు దిల్లీ యూనివర్శిటీలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన

    నేడు దిల్లీ యూనివర్శిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన

    వ్రాసిన వారు Stalin
    Jan 27, 2023
    02:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించినా దేశంలో ప్రదర్శనలు ఆగడం లేదు. ముఖ్యంగా యూనివర్సిటీల్లో పలు విద్యార్థి సంఘాలు ప్రతిష్టాత్మంగా తీసుకొని ప్రదర్శిస్తున్నాయి. తాజాగా దిల్లీ యూనివర్సిటీలో ఎన్ఎస్‌యూఐ, భీమ్ ఆర్మీ, వామపక్షతో పాటు ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నార్త్ క్యాంపస్‌లో ప్రదర్శించనున్నట్లు పిలుపునిచ్చారు.

    2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని రూపొందించింది. ప్రస్తుతం రెండు ఎపిసోడ్లు విడుదలయ్యాయి. అయితే డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది.

    బీబీసీ

    డాక్యుమెంటరీ ప్రదర్శనకు అనుమతి లేదు: అధికారులు

    బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనపై దిల్లీ యూనివర్సిటీ అధికారులు స్పందించారు. డాక్యుమెంటరీ ప్రదర్శనకు అనుమతి లేదని, స్క్రీనింగ్‌ను ఆపేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

    ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో వామపక్ష విద్యార్థి సంఘాలు స్క్రీనింగ్ చేసేందుకు ప్రయత్నించగా అధికారులు అనుమనితి నిరాకరించారు.

    జేఎన్‌యూలో అధికారులు ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. జామియా మిలియా ఇస్లామియాలో బిబిసి డాక్యుమెంటరీ ప్రదర్శనను నిర్వహించినందుకు 13 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

    2002లో గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వర్గం రైలును తగలబెట్టి, 59 మంది హిందూ యాత్రికులను సజీవ దహనం చేశారు. అనంతరం గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు చెలరేగగా, అప్పుడు ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నారు. ఈ మారణహోమంలో అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 1,050మంది ప్రాణాలు కోల్పోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    నరేంద్ర మోదీ

    తాజా

    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    దిల్లీ

    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? టాటా
    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ కాంగ్రెస్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు ఉత్తర్‌ప్రదేశ్
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని రోడ్డు ప్రమాదం

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ ప్రధాన మంత్రి
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025