
AP Inter Results: ఇవాళే ఇంటరే ఫలితాలు..వేచియున్న 10లక్షల మంది విద్యార్థులు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా రెండు సంవత్సరాలకు కలిపి మొత్తం 10,17,102 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
ఫలితాలను అధికారిక వెబ్సైట్లు అయిన [https://www.eenadu.net](https://www.eenadu.net), [https://resultsbie.ap.gov.in](https://resultsbie.ap.gov.in) లో వీక్షించవచ్చు.
Details
11 గంటలకు విడుదల
అదనంగా 'మన మిత్ర' వాట్సప్ యాప్ ద్వారా కూడా ఫలితాలను సులభంగా పొందవచ్చు.
ఇందుకోసం 95523 00009 నంబరుకు 'హాయ్' అని మెసేజ్ పంపి, ఫలిత ఎంపికను చేసి అవసరమైన వివరాలు పంపితే, పీడీఎఫ్ రూపంలో ఫలితాలను పొందొచ్చు. ఈ ఫలితాలను షార్ట్ మెమోగా కూడా ఉపయోగించవచ్చు.
ఇంటర్ ఫలితాల ప్రకటన సమయంలో ఆందోళన లేకుండా, పూర్తిగా వ్యవస్థబద్ధంగా విడుదల చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిర్ణయించడాన్ని అధికారులు ప్రస్తావించారు.