Manipur viral video: సుప్రీంకోర్టును ఆశ్రయించిన మణిపూర్ లైంగిక వేధింపుల బాధితులు; నేడు విచారణ
ఇటీవల మణిపూర్లో ఇద్దరు మహిళలను వివస్త్రగా ఊరేగించిన వీడియో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాధితులు ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మణిపూర్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని బాధితులు ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసుపై సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. జూలై 19న మణిపూర్లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ఇద్దరు కుకీ మహిళలను ఒక గుంపు వీధిలో నగ్నంగా ఊరేగించింది. అంతేకాదు ఆ మహిళపై అత్యాచారం కూడా జరిగింది. ఈ వీడియో మే 3న మణిపూర్లో చెలరేగిన హింసాకాండ తర్వాత మరుసటి రోజు మే 4న జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మే 18న కాంగ్పోక్పీ జిల్లా సైకుల్ పోలీస్ జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.