Page Loader
Nitin Gadkari: రాజస్థాన్‌లో టోల్ ట్యాక్స్ ధర కంటే ఎక్కువ వసూలు.. వివరణ ఇచ్చిన నితిన్ గడ్కరీ 
రాజస్థాన్‌లో టోల్ ట్యాక్స్ ధర కంటే ఎక్కువ వసూలు.. వివరణ ఇచ్చిన నితిన్ గడ్కరీ

Nitin Gadkari: రాజస్థాన్‌లో టోల్ ట్యాక్స్ ధర కంటే ఎక్కువ వసూలు.. వివరణ ఇచ్చిన నితిన్ గడ్కరీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2024
06:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ ప్లాజాలో టోల్ ట్యాక్స్ ధర కంటే ఎక్కువ వసూలు చేసిన ఆరోపణలపై కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. రూ.1900 కోట్లతో నిర్మించిన రోడ్డుపై రూ.8000 కోట్ల టోల్ ట్యాక్స్ ఎలా వసూలు చేశారనే ప్రశ్నకు గడ్కరీ వివరణ ఇచ్చారు. నితిన్ గడ్కరీ, ఢిల్లీ-జైపూర్ హైవేపై టోల్ ట్యాక్స్ వసూలు పెరిగిన అంశాన్ని ఉదాహరణతో వివరించారు. నిర్మాణ ఖర్చు కంటే ఎక్కువ టోల్ ట్యాక్స్ వసూలు చేయడం అనేది రోడ్డు నిర్మాణం, నిర్వహణ, రుణాల సమర్థతతో సంబంధం ఉంటుందన్నారు. ఒక వ్యక్తి రూ.2.5 లక్షలతో ఇల్లు లేదా కారు కొంటే, అతను 10 సంవత్సరాలకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటాడు.

Details

అధిక టోల్ వసూల్ పై కేసు 

ఒకవేళ ఇల్లు లేదా కారు ధర పెరుగుతుంది. దానికి ప్రతి నెలా వడ్డీ చెల్లించాలి. ఇవన్నీ మళ్లీ అప్పులు చేసి, బాధ్యతలను భరించుకోవాలి. అలాగే, రోడ్డు నిర్మాణానికి కూడా అప్పులు తీసుకుంటారని, దీని విలువ కూడా పెరుగుతుందని గడ్కరీ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితిలో ఢిల్లీ-జైపూర్ హైవేపై అధిక టోల్ వసూలు చేసిన అంశంపై కేసు నడుస్తోంది. ఈ రహదారిని 2009లో యూపీఏ ప్రభుత్వం కేటాయించింది. అప్పట్లో 9 బ్యాంకులను ఇందులో చేర్చారు. నిర్మాణం సమయంలో కాంట్రాక్టర్లు మారడం, బ్యాంకులు కేసులు పెట్టడం వంటి సమస్యలు తలెత్తాయి. ఢిల్లీ హైకోర్టు ఈ కేసుపై స్టే జారీ చేసింది. .