NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్ణాటకలో టామాటా పంటను దోచుకున్న దొంగలు.. కన్నీరుమున్నీరైనా  మహిళా రైతు
    తదుపరి వార్తా కథనం
    కర్ణాటకలో టామాటా పంటను దోచుకున్న దొంగలు.. కన్నీరుమున్నీరైనా  మహిళా రైతు
    కర్ణాటకలో టామాటా పంటను దోచుకున్న దొంగలు

    కర్ణాటకలో టామాటా పంటను దోచుకున్న దొంగలు.. కన్నీరుమున్నీరైనా  మహిళా రైతు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 06, 2023
    02:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటకలో టామాటా దొంగలు పేట్రేగిపోయారు.దీంతో బాధిత మహిళా రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఓ వైపు దేశవ్యాప్తంగా టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు కొందరు దుండగులు ఏకంగా టామాటా పంటనే దొంగిలించారు.

    సుమారు 2 ఎకరాల్లో టామాటా పంటను సాగు చేసింది.పంటను కోసి రాజధాని బెంగళారులోని మార్కెట్ కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    ఈ నేపథ్యంలో పండిన పంట అంతా కోసుకుని వెళ్లిపోయారని సదరు మహిళా రైతు రోదిస్తున్నారు. ఈ పంట విలువ దాదాపుగా రూ.2.5 లక్షలు ఉంటుందన్నారు. ప్రస్తుతం బెంగళూరులో కిలో టమాటా రూ. 120కిపైనే పలుకుతోందట.

    ఆరు గాలం కష్టించి పండించిన పంట తీరా చేతికందే క్రమంలో కొందరు ప్రభుద్ధులు చేతివాటం ప్రదర్శించారు. దీంతో ఆ రైతు ఎంతో వేదనకు గురవుతున్నారు.

    details

    హైదరాబాద్ లో కిలో రూ.150 మార్క్ క్రాస్ చేసిన టామాటా 

    టమాటాలను దొంగలించిన దుండగులు అక్కడే ఉన్న మిగతా పంటలను ధ్వంసం చేసిపోయారని మహిళా రైతు కంటతడి పెట్టుకుంది.

    ఈ క్రమంలో నిందితులపై హలెబీడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే సదరు దుండగులు ఎవరో వెతికి పట్టుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను అభ్యర్థించింది.

    అయితే ప్రస్తుతం ఎన్నడూ లేని రీతిలో టామాటా ధరలు ఆకాశంలో విహరిస్తున్నాయి.

    దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కిలో టామాటా రూ.100 దాటడం గమనార్హం. మెట్రో సిటీ హైదరాబాద్ లో కిలో ధర రూ. 150పైనే పలుకుతోంది.

    ఈ రేట్లు చూసిన సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు అసలు టమాటాల ఊసు కూడా ఎత్తడం లేదు.

    DETAILS

    దేశవ్యాప్తంగా మండిపోతున్న కూరగాయల ధరలు

    టామాటా పంట అధిక ధర సందర్భంగా వాటివైపు తొంగి చూసేందుకూ జనం భయపడుతున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయాల వైపు అడులేస్తున్నారు. మిగతా కూరగాయల ధరలూ చుక్కలు చూపిస్తున్నాయి.

    దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో టమాటా ధరలు :

    దిల్లీలో రూ. 129,

    మొరాదాబాద్‌లో రూ. 150

    బెంగళూరులో రూ.120

    హైదరాబాద్ రూ.150

    మిగతా కూరగాయల ధరలు కూడా భారీగానే పెరిగిపోయాయి. మేలో రూ. 40 ఉన్న కాలీఫ్లవర్ ఇప్పుడు రూ. 60కి చేరింది. రూ. 30-40 ఉన్న క్యాబేజీ సైతం రూ. 60ని తాకింది.

    ఉల్లి, బంగాళదుంపల ధరలు రూ. 20 నుంచి రూ. 30కి చేరుకున్నాయి. కిలో బీన్స్ ధర రూ.160ను తాకడంతో టమాటాతో పోటీపడుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    Gold loan: బంగారం తాకట్టు రుణాలపై కొత్త మార్గదర్శకాలు త్వరలోనే విడుదల: ఆర్‌బీఐ గవర్నర్‌  సంజయ్ మల్హోత్రా
    Etala Rajender: కాళేశ్వరం కమిషన్‌ విచారణలో ఈటల రాజేందర్‌: అన్ని విషయాలూ కేసీఆర్‌,హరీష్‌ దగ్గరే!  ఈటల రాజేందర్
    NEET PG 2025: నీట్-పీజీ 2025 వాయిదా - ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం  సుప్రీంకోర్టు
    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్

    కర్ణాటక

    కర్ణాటకలో మళ్లీ హంగ్; సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్; ఎగ్జిట్ పోల్స్ అంచనా అసెంబ్లీ ఎన్నికలు
    నేడే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు; 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు  అసెంబ్లీ ఎన్నికలు
    కర్ణాటక ఎన్నికల ఫలితాలు: ఎమ్మెల్యేందరూ బెంగళూరు చేరుకోవాలని కాంగెస్ పిలుపు కాంగ్రెస్
    కర్ణాటక ఎన్నికల్లో ఆధిక్యంపై ​​కాంగ్రెస్ 'అన్‌స్టాపబుల్' ట్వీట్  కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025