
Supreme Court: 'ఫెడరలిజానికి ఏమైంది ..?' ఈడీపై సుప్రీం మరోసారి సీరియస్
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు మద్యం కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తు జరుపుతోన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న రాష్ట్ర పోలీసుల హక్కులను లాగేసుకోవడం లేదా? అని ప్రశ్నించింది అలాగే, సమాఖ్య వ్యవస్థ గౌరవం సంగతేంటని మరోసారి నిలదీసింది. "రాష్ట్ర పోలీసుల హక్కులను ఉల్లంఘిస్తున్నారా? మీకు అనుమానం ఉంటే, మీరు సొంతంగా దర్యాప్తు చేస్తారా? సమాఖ్య వ్యవస్థకు ఏమైంది? ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయకపోతే శాంతి భద్రతలను ఎవరు నియంత్రిస్తారు? గత ఆరు సంవత్సరాలుగా ED కి సంబంధించిన అనేక కేసులు చూశాను. మళ్లీ నేనేం చెప్పదలచుకోలేదు" అని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.
వివరాలు
మార్చిలో టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో సోదాలు
కథనం ప్రకారం,తమిళనాడులో మద్యం రిటైలర్ 'టాస్మాక్ (TASMAC)'లో అవకతవకలు వెలుగులోకి వచ్చిన తర్వాత, రాష్ట్ర పోలీసులు,అవినీతి నిరోధక శాఖ (ACB) నమోదు చేసిన కేసుల ఆధారంగా ED మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తు క్రమంలో మార్చిలో టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో సోదాలు జరిపింది. తరువాత, మే నెలలో సంబంధిత అధికారుల ఇళ్లలో కూడా తనిఖీలు జరగాయి. తర్వాత ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది.
వివరాలు
ED తీరుపై ఆక్షేపించిన ధర్మాసనం
విచారణలో ధర్మాసనం ED తీరుపై ఆక్షేపించింది. ఇది తన అధికార పరిమితులను దాటుతున్నది,సమాఖ్య పాలన భావనను ఉల్లంఘిస్తున్నది అని పేర్కొంది. టాస్మాక్పై ED చేస్తున్న మనీలాండరింగ్ దర్యాప్తుపై మొదట స్టే విధించబడింది. తాజాగా, విచారణను మళ్లీ ప్రారంభించారు. ఈ నేపధ్యంలో, సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మరియు జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం, ED వ్యవహారంపై తన అసంతృప్తిని మరల వ్యక్తం చేసింది.