NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వాన పేరుతో రైతులను మోసం చేసిన వ్యాపారులు
    తదుపరి వార్తా కథనం
    వాన పేరుతో రైతులను మోసం చేసిన వ్యాపారులు
    మిర్చి బస్తాలతో నిండిపోయిన మార్కెట్

    వాన పేరుతో రైతులను మోసం చేసిన వ్యాపారులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 12, 2023
    05:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అకాల వర్షంతో పంట తడిసిపోయిందని రైతులు బాధపడుతుండగా.. ఈ నెపంతో వ్యాపారులు ధర తగ్గించి రైతులను మోసం చేశారు.

    ఖమ్మంలో గురువారం ఉదయం భారీ వర్షం పడింది. దీంతో ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్ లో అమ్మకానికి వచ్చిన మిర్చి బస్తాలు కొన్ని తడిసిపోయాయి.

    దీన్ని వ్యాపారులు అదునుగా చేసుకొని మిర్చి తడిసిపోవడంతో నాణ్యత తగ్గిందని, చివరి కోత కావడంతో పనికి రాదని సాకులు చెబుతూ తక్కువ ధరకు మిర్చిని కొనుగోలు చేశారు.

    దూరప్రాంతాల నుంచి వచ్చిన రైతులు చేసేది ఏమీ లేక వ్యాపారులు చెప్పిన ధరకు అమ్ముకొని బాధతో వెనుతిరిగారు.

    మార్కెట్ కమిటీ లెక్కల ప్రకారం 23,780 బస్తాల మిర్చి విక్రయానికి వచ్చింది. జెండాపాటలో మిర్చి 23,051 ధర పలకడంతో రైతులు సంబరపడ్డారు.

    Details

    సిండికేట్ గా మారిన వ్యాపారులు

    అయితే వ్యాపారులు సిండికేట్ గా మారి ధరను తగ్గించేశారు. తడిసిన మిర్చిని కొనమని వ్యాపారులు తెగేసి చెప్పడంతో రైతులు ప్రాధేయపడాల్సి వచ్చింది. దీంతో క్వింటాకు ఏకంగా రూ.10వేల వరకు తగ్గించేశారు.

    వ్యాపారులు ఎక్కువ మంది రైతుల నుంచి క్వింటా మిర్చిని రూ.13వేల నుంచి రూ.14వేల లోపు కొనుగోలు చేశారు. మరోవైపు బస్తాకు మూడు కిలోల చొప్పున తరుగును తీశారు. అయితే కాంటా సమయంలో బస్తా మిర్చికి కిలో చొప్పున మాత్రమే తరుగు తీయాల్సి ఉంది.

    జెండా పాట రూ.23,051, కనిష్ట ధర రూ.12,500 పలికిందని, అయితే ఎర్రరకం మిర్చి ధరలు ఆశాజనకంగానే ఉన్నాయని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ధర
    ఖమ్మం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ధర

    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    2023 బజాజ్ పల్సర్ 220F గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఇయర్ (2) కొత్త TWS ఇయర్‌బడ్‌లు టెక్నాలజీ
    బజాజ్ పల్సర్ 220F Vs TVS అపాచీ ఆర్‌టిఆర్ 200 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్

    ఖమ్మం

    ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం! కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    తెలంగాణ: నష్టపోయిన పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌; ఎకరాకు రూ.10వేల పరిహారం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025