LOADING...
Sabarimala: సంప్రదాయాలు వర్సెస్ సమానత్వం.. శబరిమల కేసులో సుప్రీంకోర్టులో కీలక విచారణ
సంప్రదాయాల వర్సెస్ సమానత్వం.. శబరిమల కేసులో సుప్రీంకోర్టులో కీలక విచారణ

Sabarimala: సంప్రదాయాలు వర్సెస్ సమానత్వం.. శబరిమల కేసులో సుప్రీంకోర్టులో కీలక విచారణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 07, 2026
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై గతంలో వెలువడిన తీర్పును సుప్రీంకోర్టు మళ్లీ సమీక్షిస్తోంది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం మంగళవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ప్రస్తుతం పిటిషన్ దారుల వాదనలు వింటున్న ధర్మాసనం ముందు, కేంద్ర ప్రభుత్వం తన వివరణను ఇప్పటికే సమర్పించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, శబరిమలలో మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలు ప్రాచీన సంప్రదాయాలకు అనుగుణంగా విధించబడ్డాయని తెలిపారు. ఇందులో ఎలాంటి వివక్ష ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. మహిళల ప్రవేశాన్ని అనుమతించడం వల్ల ఆలయ ఆరాధనా స్వరూపమే మారిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు

మత విశ్వాసలపై ఆధారపడి ఉంది

శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాల ప్రకారం స్త్రీలు, పురుషులు ఇద్దరూ స్వామిని పూజిస్తున్నారని, ఈ అంశం పూర్తిగా మత విశ్వాసాలకు సంబంధించినదని పేర్కొన్నారు. అందువల్ల ఇది న్యాయసమీక్ష పరిధికి అతీతమని వాదిస్తూ, ప్రస్తుతం అమల్లో ఉన్న మహిళల ప్రవేశ ఆంక్షలను కొనసాగించాలని సుప్రీంకోర్టును కోరారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో, 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించకుండా ఉన్న నిషేధాన్ని రద్దు చేసింది. అయితే ఆ తీర్పుపై పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలోనే తొమ్మిది మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును సమగ్రంగా విచారిస్తోంది.

Advertisement