NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
    తదుపరి వార్తా కథనం
    Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
    హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్

    Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 16, 2024
    09:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్. గణేశ్ నిమజ్జన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి.

    ఈ ఆంక్షలను గణేశ్ శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నెల 17, 18 తేదీల్లో అమలు చేస్తారని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

    బాలాపూర్ నుంచి గుర్రం చెరువు ట్యాంక్‌పై కట్టమైసమ్మ ఆలయం వరకు గణేశ్ ప్రధాన ఊరేగింపు ప్రారంభమవుతుందని,అది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుందని పేర్కొన్నారు.

    ప్రధాన రూట్లలో కేశవగిరి,చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్,ఎంబీఎన్‌ఆర్ ఎక్స్ రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జ్,ఆలియాబాద్,చార్మినార్, మదీనా,అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్‌ఆర్ మార్గ్ అంబేడ్కర్ విగ్రహం వైపు శోభాయాత్ర సాగుతుందని తెలిపారు.

    వాహనాదారులు ఈసమయంలో ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు.

    వివరాలు 

    ట్రాఫిక్ ఆంక్షలు, ఈ రూట్లలోనే..

    సికింద్రాబాద్ నుంచి వచ్చే గణేశ్ శోభాయాత్ర వాహనాలను సంగీత్ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్ జంక్షన్, ఎంజీ రోడ్, కర్బలా మైదాన్, ట్యాంక్‌బండ్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు మళ్లించనున్నారు.

    చిలకలగూడ నుంచి గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ ఎక్స్ రోడ్,నారాయణగూడ ప్లైఓవర్, హిమాయత్‌నగర్ మీదుగా లిబర్టీ వైపు మళ్లిస్తారు.

    దిల్‌సుఖ్‌నగర్ నుంచి వచ్చే ఊరేగింపులు ఐఎస్ సదన్,సైదాబాద్,చంచల్‌గూడ మీదుగా నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద కలుస్తాయి. అక్కడి నుంచి మూసారాంబాగ్,అంబర్‌పేట్ వైపు వెళ్తాయి.

    తార్నాక వైపు వచ్చే విగ్రహాలు ఓయూ దూర విద్యాకేంద్రం రోడ్,అడిక్‌మెట్ మీదుగా విద్యానగర్,ఫీవర్ ఆసుపత్రి వరకు చేరుతాయి.

    ఉప్పల్ నుంచి వచ్చే విగ్రహాలు రామంతాపూర్,శ్రీరమణ జంక్షన్,తిలక్‌నగర్,ఫీవర్ ఆసుపత్రి, బర్కత్‌పుర మీదుగా నారాయణగూడ వైఎంసీఏకు చేరుకుంటాయి.ఇవి ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఊరేగింపుతో కలుస్తాయి.

    వివరాలు 

    ట్రాఫిక్ ఆంక్షలు, ఈ రూట్లలోనే..

    టోలిచౌకి, రేతిబౌలి, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే విగ్రహాలు మాసబ్‌ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ద్వారకా హోటల్ జంక్షన్, ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుతాయని వెల్లడించారు.

    టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్ వైపు నుంచి వచ్చే విగ్రహాలు సీతారాంబాగ్, వోల్గా హోటల్, గోషా మహల్, మాలకుంట మీదుగా ఎంజేఎం వద్ద ప్రధాన ఊరేగింపులో చేరతాయి. ఎర్రగడ్డ నుంచి వచ్చే శోభాయాత్రలు ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ మీదుగా నిరంకారి భవన్ వద్ద చేరి ఎన్టీఆర్ మార్గ్ వరకు వెళ్తాయని తెలిపారు.

    వాహనదారులు ఈ నెల 17, 18 తేదీల్లో ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలను గౌరవించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ప్రేరణ
    Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ కమల్ హాసన్
     Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్ స్పోర్ట్స్
    CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్.. ఆపరేషన్‌ సిందూర్‌

    హైదరాబాద్

    YS Jagan : వైఎస్ జగన్‌ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చిన అధికారి సస్పెండ్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    Hyderabad: హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాకు అంతరాయం.. ప్రభావిత ప్రాంతాల పూర్తి జాబితా తెలంగాణ
    Air pollution: దేశంలోని 10 నగరాల్లో ఏడు శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణం, అగ్రస్థానంలో ఏ రాష్ట్రం ఉందో తెలుసా?  వాయు కాలుష్యం
    Hyderabad : విషాదం.. అమెరికాలో నీటమునిగి హైదరాబాద్ యువకుడు మృతి అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025