Page Loader
Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్

Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2024
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్. గణేశ్ నిమజ్జన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. ఈ ఆంక్షలను గణేశ్ శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నెల 17, 18 తేదీల్లో అమలు చేస్తారని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. బాలాపూర్ నుంచి గుర్రం చెరువు ట్యాంక్‌పై కట్టమైసమ్మ ఆలయం వరకు గణేశ్ ప్రధాన ఊరేగింపు ప్రారంభమవుతుందని,అది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుందని పేర్కొన్నారు. ప్రధాన రూట్లలో కేశవగిరి,చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్,ఎంబీఎన్‌ఆర్ ఎక్స్ రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జ్,ఆలియాబాద్,చార్మినార్, మదీనా,అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్‌ఆర్ మార్గ్ అంబేడ్కర్ విగ్రహం వైపు శోభాయాత్ర సాగుతుందని తెలిపారు. వాహనాదారులు ఈసమయంలో ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు.

వివరాలు 

ట్రాఫిక్ ఆంక్షలు, ఈ రూట్లలోనే..

సికింద్రాబాద్ నుంచి వచ్చే గణేశ్ శోభాయాత్ర వాహనాలను సంగీత్ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్ జంక్షన్, ఎంజీ రోడ్, కర్బలా మైదాన్, ట్యాంక్‌బండ్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు మళ్లించనున్నారు. చిలకలగూడ నుంచి గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ ఎక్స్ రోడ్,నారాయణగూడ ప్లైఓవర్, హిమాయత్‌నగర్ మీదుగా లిబర్టీ వైపు మళ్లిస్తారు. దిల్‌సుఖ్‌నగర్ నుంచి వచ్చే ఊరేగింపులు ఐఎస్ సదన్,సైదాబాద్,చంచల్‌గూడ మీదుగా నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద కలుస్తాయి. అక్కడి నుంచి మూసారాంబాగ్,అంబర్‌పేట్ వైపు వెళ్తాయి. తార్నాక వైపు వచ్చే విగ్రహాలు ఓయూ దూర విద్యాకేంద్రం రోడ్,అడిక్‌మెట్ మీదుగా విద్యానగర్,ఫీవర్ ఆసుపత్రి వరకు చేరుతాయి. ఉప్పల్ నుంచి వచ్చే విగ్రహాలు రామంతాపూర్,శ్రీరమణ జంక్షన్,తిలక్‌నగర్,ఫీవర్ ఆసుపత్రి, బర్కత్‌పుర మీదుగా నారాయణగూడ వైఎంసీఏకు చేరుకుంటాయి.ఇవి ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఊరేగింపుతో కలుస్తాయి.

వివరాలు 

ట్రాఫిక్ ఆంక్షలు, ఈ రూట్లలోనే..

టోలిచౌకి, రేతిబౌలి, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే విగ్రహాలు మాసబ్‌ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ద్వారకా హోటల్ జంక్షన్, ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుతాయని వెల్లడించారు. టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్ వైపు నుంచి వచ్చే విగ్రహాలు సీతారాంబాగ్, వోల్గా హోటల్, గోషా మహల్, మాలకుంట మీదుగా ఎంజేఎం వద్ద ప్రధాన ఊరేగింపులో చేరతాయి. ఎర్రగడ్డ నుంచి వచ్చే శోభాయాత్రలు ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ మీదుగా నిరంకారి భవన్ వద్ద చేరి ఎన్టీఆర్ మార్గ్ వరకు వెళ్తాయని తెలిపారు. వాహనదారులు ఈ నెల 17, 18 తేదీల్లో ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలను గౌరవించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.