NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Goa Stampede: జాతరలో విషాదం.. గోవా ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
    తదుపరి వార్తా కథనం
    Goa Stampede: జాతరలో విషాదం.. గోవా ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
    జాతరలో విషాదం.. గోవా ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి

    Goa Stampede: జాతరలో విషాదం.. గోవా ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 03, 2025
    08:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గోవా రాష్ట్రంలోని శిర్గావ్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.

    అక్కడ ఉన్న శ్రీ లైరాయ్‌ దేవాలయంలో వార్షిక జాతర సందర్భంగా భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో శనివారం తెల్లవారుజామున ఘోరమైన తొక్కిసలాట జరిగింది.

    ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.

    క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.

    ప్రతేడాది జరిగే లైరాయ్‌ అమ్మవారి జాతర ఈసారి శుక్రవారం ప్రారంభమైంది. గోవా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

    శనివారం తెల్లవారుజామున జరిగే 'నిప్పులపై నడిచే' ప్రత్యేక ఆచారానికి భారీగా భక్తులు హాజరయ్యారు.

    Details

    సహాయక చర్యలను ప్రారంభించిన పోలీసులు

    ఈ నేపథ్యంలో జనం రద్దీ పెరగడంతో నియంత్రణ కోల్పోయిన భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ పడ్డారు. ఈ తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

    వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

    ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, భారీ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ నిర్వాహకులు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ విషాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గోవా
    ఇండియా

    తాజా

    Bitcoin: దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. 1,11,000 డాలర్లకు బిట్‌కాయిన్‌ క్రిప్టో కరెన్సీ
    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్

    గోవా

    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి మహారాష్ట్ర
    TVS MotoSoul 2023లో రోనిన్ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన ఆటో మొబైల్
    షాకింగ్ న్యూస్: గోవాలో పర్యాటక కుటుంబంపై కత్తులతో దాడి; సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్ విహారం
    పీఎఫ్‌ఐ విచారణ: బిహార్, యూపీ, పంజాబ్, గోవాలో ఎన్‌ఐఏ దాడులు ఎన్ఐఏ

    ఇండియా

    Microsoft Turns 50 : MS-DOS నుంచి AI వరకూ.. 50 ఏళ్ల మైక్రోసాఫ్ట్‌ ప్రయాణం ఓ అధ్యాయమే! మైక్రోసాఫ్ట్
    AP: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాలకు పిడుగుల ముప్పు! ఆంధ్రప్రదేశ్
    Reciprocal tariffs: అమెరికా 27శాతం సుంకాలు.. వాణిజ్యశాఖ అధికారిక స్పందన! భారతదేశం
    Maoists: 'ఆపరేషన్ చేయూత' ఫలితం.. లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025